బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 2 వారాలవుతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. ఒకరు కమెడియన్ కుమార్ సాయి కాగా మరొకరు జబర్దస్త్ అవినాష్. అయితే ఈ సీజన్కు ఈ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలే ఉంటాయని ప్రేక్షకులనుకున్నారు. కానీ మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉందని ఎవరు ఊహించలేదు. అయితే ఈసారి అబ్బాయిని కాకుండా అమ్మాయిని రంగంలోకి దించుతున్నారు బిగ్ బాస్ టీం.
ఆ హీరోయిన్ ఎవరో కాదు. మన అల్లరి నరేష్ హీరోయిన్.. స్వాతి దీక్షిత్. ఈ అందాల తార తెలుగులో కొన్ని సినిమాల్లో నటించడమే కాకుండా “జంప్ జిలానీ” సినిమాలో అల్లరి నరేష్ తో కూడా రొమాన్స్ పండించింది. అయితే బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో ఇప్పటికే అల్లరి నరేష్ తో నటించిన మోనాల్ గజ్జర్, హారిక, దివి, అరియానా లాంటి అందమైన అమ్మాయిలు ఉండగా ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో బ్యూటీని తీసుకొస్తున్నారు షో నిర్వాహకులు. సో.. మనం ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో అల్లరి నరేష్ హీరోయిన్లు సందడి చేస్తున్నారన్నమాట. మొదటి పార్టిసిపంట్ గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సుడిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్.
తాను సినిమాల్లోకి రాకముందు ఒక ప్రైవేటు బ్యాంకులో పని చేసింది. మిస్ గుజరాత్ కిరీటాన్ని దక్కించుకున్న ఈ భామ దక్షిణాదిన తెలుగు, తమిళ, మళయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్లోనూ 2 సినిమాలు చేసింది. మోనాల్ గజ్జర్. బ్రదరాఫ్ బొమ్మాళి సినిమాలో చివరిసారిగా కనిపించింది. తెలుగు అంతగా రాని ఈ భామ పలికే చిలక పలుకులు ప్రేక్షకులను ఏమేరకు బుట్టలో వేసుకుంటాయో చూడాలి. ఎలాగైనా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అయి తానేంటో చూపించుకుంటానంటోంది. కానీ ఎమోషనల్గా వీక్ అంటున్న మోనాల్ మిగతా కంటెస్టెంట్ల ఎత్తుగడలను ఎదుర్కోగలుగుతుందా? భావోద్వేగాలను అధిగమించి ముందుకు వెళ్లగలుగుతుందా? అనేది చూడాలి! ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల నటి స్వాతి దీక్షిత్.. మరీ అంత అనామకురాలు ఏమీ కాదు ఫాఫం… కాకపోతే చాలారోజులుగా తెరమరుగైపోవడంతో ప్రేక్షకులు ఈమెను మర్చిపోయారంతే.!
2013లో బ్రేకప్, 2014లో జంప్ జిలానీ, 2015లో లేడీస్ అండ్ జెంటిల్మన్, తరువాత రెండేళ్లు ఖాళీ, 2017లో చిత్రాంగద, ఓ తమిళ సినిమా, 2019లో ఇంకో తమిళ సినిమా… ఇలా 2009 నుంచి టీవీల్లో పనిచేస్తూ… చాన్సుల కోసం కష్టపడుతూనే ఉంది. మధ్యలో రాంగోపాలవర్మ తీసిన “పట్టపగలు” అనే సినిమాలో నటించింది కానీ, ఆమె దురదృష్టం… అది వెలుగు చూడలేదు… ఆమె తొలి సినిమా కూడా బెంగాలీయే ఇలా పెద్దగా అవకాశాల్లేని తార మరి తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ బ్యూటీ స్వాతి దీక్షిత్ ఎంత వరకు బిగ్ బాస్ హౌస్ లో నెగ్గుకువస్తుందో చూడాలి మరి..!
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.