మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రముఖులు కానీ, సినీ రంగ ప్రముఖులు కానీ చిరంజీవిపై, అలాగే పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న సమయంలో వెంటనే వారి నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి విమర్శలకు మెగా ఫ్యాన్స్ మరియు జన సైనికుల నుండి మంచి స్పందనే వస్తుంది.
సోషల్ మీడియాలో నాగబాబుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే నాగబాబు అప్పుడప్పుడు మతం గురించో, దేవుడు గురించో చేసే ట్వీట్లు మాత్రం నెటిజనులనే కాకుండా అటు జన సైనికులను, ఇటుమెగా ఫ్యాన్స్ ను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి ఉదాహరణగా తాజాగా ‘దేవుడు’ అన్న కాన్సెప్ట్ గురించి నాగబాబు చేసిన ట్వీట్ వైరలైంది. ఈ ట్వీట్ ఇంతిలా వైరల్ కావడానికి కారణమేమిటంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ని తన ట్వీట్ లో టార్గెట్ చేశాడు. తాజాగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తీసుకొని తనకు తెలిసిన విశ్లేషణను ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో హిందూ దేవుళ్ళపై విమర్శలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు ఇప్పుడసలు దేవుడే లేడంటూ కొత్తగా ట్వీట్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్ ఆధారంగా నాగబాబు షేర్ చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే..
మన కంటికి కనిపించేది ఏదైనా.. ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే. లేకపోతే ఆ వస్తువుకి ఉనికి వుండదు. అలాగే ఇంతటి సువిశాల ప్రపంచం కూడా ఉనికిలో ఉందంటే దాన్ని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. ఆయనే భగవంతుడు అని రజనీ కాంత్ చెప్పారు. ఆ ట్వీట్స్ ఆధారంగా నాగబాబు స్పందిస్తూ `మరి ఈ విశాల ప్రపంచాన్ని క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు.? ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ ఉండి తీరాలి. ఆ కారణమే దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్కు ఇంకో రీజన్ ఉండి తీరాలి. So.. వెతుక్కుంటూ పోతే.. దానికి ఆది, అంతమే ఉండదు. So.. దేవుడు అనే కాన్సెప్ట్ కి అసలు అర్ధమే లేదు. కాబట్టి మనందరం దేవుడు లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటే సరిపోతుంది. God is dead long back. So no worries. No guilt. BUT LIVE ACCORDING TO LAW. ” అంటూ తనదైన శైలిలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కామెంట్స్ ను కొట్టి పారేశారు.
ఇంతవరకూ బాగానే వుంది. కానీ,. అసలు నాగబాబు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాక అటు మెగా ఫ్యాన్స్, ఇటు జన సైనికులు బుర్ర గోక్కుంటున్నారు. పైగా మతం, దేవుడు ఈ 2 అంశాలు చాలా సున్నితమైనవి. వీటిపై ఇష్టానుసారంగా ఎడాపెడా అభిప్రాయాలను షేర్ చేయడం వలన భవిష్యత్తులో నష్టమే తప్ప లాభమేమీ ఉండదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.