Connect with us

Featured

AP Politics: కూటమి గెలిస్తే రెండో సంతకం దానిపైనే.. లేని చట్టంపై సంతకం ఎలా చేస్తావు బాబు?

Published

on

AP Politics: మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో దూకుడు కనబరుస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొదటి సంతకం డీఎస్సీ పై పెడతానని చెప్పిన బాబు రెండో సంతకం కూడా దీనిపై పెట్టబోతున్నారనే విషయాన్ని తెలిపారు.

కూటమి గెలిస్తే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు పైనే సంతకం చేస్తానని తెలిపారు. అసలు ఏపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోనే లేదు కానీ తమ ప్రచార కార్యక్రమాల కోసం లేనది ఉన్నట్టు క్రియేట్ చేస్తూ బాబు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు.

Advertisement

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్..
ఇలాంటి టైటిలింగ్ చట్టం ద్వారా మన భూముల ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వంలో తీసుకొని కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే మనకిస్తోందని ఈ విషయంపై న్యాయ పోరాటంలో పోరాటం చేసే అవకాశాలు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. ఇలా లేని చట్టాన్ని ఉందని చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంతే కాకుండా వారిని నమ్మించడం కోసం తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పై అంటూ చంద్రబాబు బహిరంగంగా అసత్యాలు చెప్పడం అందరిని విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ntr: స్థల వివాదంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్… తనకు సంబంధమే లేదంటూ?

Published

on

Ntr: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక స్థలం విషయంలో ఈయన కోర్టు మెట్లు ఎక్కారంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ గీత అనే మహిళ వద్ద కోట్లలో విలువ చేసే స్థలం కొన్నారని అయితే ఆ స్థలం పై ఆమె బ్యాంకు లోన్ తీసుకోనీ వాటిని కట్టకుండా ఎగ్గొట్టారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా స్థల వివాదం కారణంగా ఎన్టీఆర్ భారీ నష్టాలను ఎదుర్కోబోతున్నారు అందుకే కోర్టును ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై తాజాగా ఎన్టీఆర్ టీం స్పందించారు.ఎన్టీఆర్‌కు సంబంధించి ఈరోజు ప్రచురితమైన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్‌ విక్రయించారని మేము స్పష్టం చేస్తున్నామని ఇకపై ఈ స్థల వివాదానికి సంబంధించినటువంటి వార్తలలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించడానికి వీలులేదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఎన్టీఆర్ పేరు వాడటానికి వీలు లేదు..
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమాతో పాటు బాలీవుడ్ వార్ 2 సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
Continue Reading

Featured

Anasuya: భర్తతో కలిసి అడవులలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె దాక్షాయని అని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్త పిల్లలతో కలిసి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె అడవుల బాట పడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

బర్త్ డే సెలబ్రేషన్స్..
ఇక అనసూయ తన పుట్టినరోజు వేడుకలను కూడా తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. సరదాగా కేక్ కట్ చేస్తూ తన ఫ్యామిలీతో ఈమె చిల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఇక అనసూయ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు అనసూయకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా.. నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు పలు అప్డేట్స్ విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో దేవర సినిమా విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పెట్టబోయే టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

డ్రాగన్..
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుందనే విషయం తెలియదు. ఎలాంటి బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఇదివరకు ప్రశాంత్ తన సినిమాల ద్వారా చూపించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందేనని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!