Connect with us

Political News

మంత్రి అవంతి తో కేంద్ర మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ

Published

on

మంత్రి అవంతి తో కేంద్ర సహాయ మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లో సినిమా చలన అప్పన్న ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ప్రసాదం పథకం కింద 55 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి ప్రకటించారు. అంతేకాక భక్తుల కోసం వెయిటింగ్ హాల్ యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు వెల్లడించారు.

కాగా గిరి ప్రదక్షణ కోసం కొండ చుట్టూ రాఖీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మాధవ దార మెట్లు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు

Advertisement

Featured

Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?

Published

on

Lokesh: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మొదటిసారి పోటీ చేశారు. అయితే ఈయన గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైపు పోటీ చేసినటువంటి ఈయన ఆయన చేతిలో సుమారు 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇలగతే ఎన్నికలలోకేష్ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా కూడా మంగళగిరిలో గెలవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధం కాగా ఎలాగైనా తనని ఓడించే దిశగా వైసిపి వ్యూహం రచిస్తోంది..

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు .ఈమె బిసి మహిళా కావటం విశేషం మంగళగిరిలో పెద్ద ఎత్తున బిసి ఓట్లు ఉండటంతో తనకి సీటు కేటాయించారు అంతేకాకుండా ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

బీసీ ఓట్లే లక్ష్యంగా..
మొదటినుంచి కూడా మంగళగిరిలో వైకాపాకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోకేష్ కి కూడా కాస్త మద్దతు ఉందని చెప్పాలి. ఇలా ఈయనకు మద్దతు పెరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక బీసీ మహిళ అయినటువంటి లావణ్యను జగన్ రంగంలోకి దించారు. దీంతో ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదని అక్కడ వైసిపి జెండా ఎగురుతుందంటూ వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో లావణ్య లోకేష్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Drugs: విశాఖ డ్రగ్స్ లో చంద్రబాబు హస్తం ఉంది.. నిజానిజాలు తేల్చాలి: సజ్జల

Published

on

Drugs: విశాఖ సి పోర్టులో ఓ కంటైనర్ లో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ సిబిఐ అధికారులు సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ అది ఎన్నికల సమయం ముందు అధికారులు సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారనే విషయం గురించి సిబిఐ ఆరా తీస్తున్నారు.

ఇలా విశాఖ సీ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టించడంతో చంద్రబాబు నాయుడు ఇదంతా వైకాపా పనే అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే దొంగనే దొంగ దొంగ అని అర్చినట్టూ ఉంది అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం వెనుక తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు బిజెపి హస్తము ఉందని ఈయన ఆరోపణలు చేశారు. తప్పు నుంచి బయటపడటం కోసం ఆ తప్పును మేము చేయలేదని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు మా పై బురద చల్లుతున్నానని సజ్జల వెల్లడించారు.

Advertisement

25 వేల కిలోల డ్రగ్స్..
విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలపై చంద్రబాబు నాయుడుకి గౌరవం లేదని ఆయనది వీధి స్థాయిలో మనస్తత్వం చెలరేగిపోయారు. ఇక ఈ డ్రగ్స్ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అందుకోసం తాము సిబిఐతో పాటు ఈసీ కి కూడా లేఖలు రాస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించడం కోసమే డ్రగ్ సరఫరా జరిగిందని అయితే పట్టుబడటంతో తప్పించుకోవడానికి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

AP politics: టీడీపీ మూడో జాబితా విడుదల… భగ్గుమన్న శ్రీకాకుళం.. మేనిఫెస్టో కాల్చివేత?

Published

on

AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి175 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను, అలాగే 25 స్థానాలలో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గొడవలు కానీ నిరసనలు కానీ చోటు చేసుకోలేదు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి టికెట్లు రాకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గత కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మూడో జాబితాను కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేశారు ఈ క్రమంలోనే ఈ జాబితాలో కూడా తమ పేరు లేకపోవడంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలకు తెర తీశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్‌ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు.

Advertisement

చంద్రబాబు ఫోటో ధ్వంసం..
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా తనకు టికెట్ రాకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ ఈమె పార్టీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!