Connect with us

Featured

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గెలిచిందెవరు..? బీఆర్ఎస్సా.. వైసీపీనా..? టీడీపీ సౌండ్ చేయలేదేం.. బాబోయ్ సాయంత్రానికే స్వరం మారిపోయిందేం..!

Published

on

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడే ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదని ప్రకటించేశారు. అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) బలోపేతానికి మాత్రమే కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేశామన్నారు. కులస్తే వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలిగించాయి. అంతా బాగానే ఉంది కదా. మరి పెను దుమారం అన్నారేంటి అనుకుంటున్నారా? మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ క్రెడిట్ ఎవరి దక్కాలి? ఇదే ఇప్పుడు పార్టీల మధ్య మాటల యుద్ధానికి లేటెస్ట్ కారణం.

మీరు మీరు కొట్టుకోండి..

లేటెస్ట్ కారణమేంటా? అని ఆశ్చర్యపోకండి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో మాటల యుద్ధానికి దిగాయి. ఇక ప్రైవేటీకరణ ఆగిపోవడంతో ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇక ఈ విషయంలో లేటెస్ట్‌గా తిరిగి మాటల యుద్ధానికి దిగాయి. వైసీపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ చుట్టూ తిరుగుతున్నాయి. మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయ్యింది. ఇక టీడీపీ మాత్రం మీరు మీరు కొట్టుకోండి.. నన్ను ఎంటర్‌టైన్ చేయండి అన్నట్టుగా పరిణామాలన్నింటినీ చూస్తోంది. కేసీఆర్ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్… తాము కేంద్రాన్ని పునరాలోచించడం వల్లే ఈ పరిణామమని వైసీపీ చెప్పుకుంటోంది. జనసేనాని ఏమైనా తక్కువ తిన్నారా? తామే వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి సూచించామని తెలిపారు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Advertisement

తూచ్.. నేనలా అనలే..

మొత్తానికి పార్టీలు స్టీల్ ప్లాంట్ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే షాక్ ఇచ్చారు. తూచ్ నేనలా అనలేదు అంటూ మరో ప్రకటన చేశారు. అంతే తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా నివ్వెరబోయాయి. అంతకు ముందు కులస్తే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ పోరాటం కారణంగానే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని తెలిపారు. తెగించి పోరాడామని.. కేసీఆర్ దెబ్బ ఇలాగే ఉంటుందంటూ కాస్త రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశారు. కేటీఆర్‌కు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సైతం జతయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే కేంద్రంలో మార్పు వచ్చిందని ఆయన కూడా పేర్కొన్నారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు.

ప్రైవేటీకరణపై బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశాం..

ఫగ్గన్ సింగ్ కులస్తే అంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం స్వాగతించారు. ప్రజల సెంటిమెంట్ అయిన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశామని.. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించిన అంశాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. అఖిల పక్షం సాయంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని కోరినా కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదన్నారు. విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిన మాదిరిగా వైసీపీ స్పందించలేదన్నారు. రాజకీయ ప్రయోజనాలతో విమర్శలు తప్ప.. పరిశ్రమను కాపాడతామన్న మాట మాత్రం ఏపీ ప్రభుత్వం నోటి వెంట రాలేదని పవన్ విమర్శించారు.

సాయంత్రానికి మాట మారింది..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే సాయంత్రానికి మాట మార్చేశారు. ఈ అంశం కేంద్ర కేబినెట్ పరిధిలో ఉంటుందని.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందని మీడియాపై నిందలేశారు. గురువారం సాయంత్రం నోవాటెల్ హోటల్‌లో కేంద్రమంత్రిని కలిసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి నాయకులు వెళ్లారు. ప్రైవేటీకరణ ఉండదనే వ్యాఖ్యలు చేశారు కాబట్టి ధన్యవాదాలు చెప్పుకుందామని వెళితే.. కేంద్ర మంత్రి పెద్ద బాంబే పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తన పరిధిలోది కాదని పేర్కొన్నారు. పాలసీ మేటర్ కాబట్టి ఇది కేబినెట్‌కి సంబంధించిన అంశమని.. ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్‌‌ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఎంతో ఉత్సాహంగా కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన నేతలు ఉసూరు మంటూ వెనుదిరిగారు. క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు పోటీ పడిన నేతలంతా గప్ చుప్.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!