Connect with us

Political News

YS Sharmila: ఏపీకి మరో దత్తపుత్రుడు దొరికారు.. షర్మిల ర్యాగింగ్ మామూలుగా లేదు?

Published

on

YS Sharmila: ఏపీలో పిఠాపురంలో దత్తాత్రేయుడు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అలాగే దత్తపుత్రుడు కూడా అంతే ఫేమస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన దత్తపుత్రుడు అనే పదం ఉపయోగించకుండా ఆయన సభ ముగించరు. ఇలా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల సైతం దత్తపుత్రుడు అంటూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి మరో దత్తపుత్రుడు దొరికారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రకు మరో దత్తపుత్రుడు ఎవరంటే ఆయన మరెవరో కాదు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఎలాంటి పరిశ్రమలను కూడా ఇక్కడికి తీసుకురాలేదు కేవలం తనని, తన వాళ్లను కేసుల నుంచి కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా తన వారందరిని కాపాడుకోవడం కోసం ఆంధ్రుల గౌరవాన్ని మోడీ కాళ్ల ముందు పెట్టారని మోడీకి ఈయన దత్తపుత్రుడిగా మారారని షర్మిల కామెంట్లు చేశారు.

Advertisement

ఇలా రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దగ్గర తాకట్టుపెట్టి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అంటూ ఈమె కామెంట్లు చేశారు. ఇలా ఈమె కామెంట్ లో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ విమర్శించే జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి దత్తపుత్రుడుగా మారిపోయారు అంటూ కామెంట లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

YS Vijayamma: ఎన్నికలవేళ కొడుకు పై తల్లి ప్రేమ చాటుకున్న విజయమ్మ.. జగన్ అంటే అంత ఇష్టమా?

Published

on

YS Vijayamma: ఏపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా కూటమి నేతలు ఎన్నో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక చివరికి తన కన్నతల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపలేదంటూ ప్రచారాలు చేశారు కానీ వైయస్ విజయమ్మకు తన కూతురు షర్మిల కంటే కొడుకు జగన్ అంటేనే ఇష్టమని తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.

ఇటీవల వైఎస్ షర్మిలని గెలిపించాలి అంటూ ఈమె ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియోలో భాగంగా జగన్ పై తనకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు. వైయస్సార్ ముద్దుల బిడ్డ వైయస్ షర్మిలమ్మ కడప పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఈమె అందరిని వేడుకున్నారు.

ఇక ఈ వీడియోలో భాగంగా వైయస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఎక్కడా కూడా ఈమె కాంగ్రెస్ పేరు పలకలేదు అలా పలకడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా షర్మిలను గెలిపించాలని చెప్పారే తప్ప వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎక్కడా కోరలేదు.

Advertisement

కాంగ్రెస్ పేరు కూడా పలకలేదు…
ఇక ఈ వీడియోలో భాగంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎక్కడ పలకలేదు. దీన్ని బట్టి చూస్తేనే ఈమె తన కొడుకుకు మద్దతు తెలుపుతున్నారని, తన కొడుకు అంటేనే విజయమ్మకు ప్రేమ ఉందని తెలుస్తుంది అలాకాకుండా పూర్తిగా తన కూతురికే మద్దతు తెలిపేలాగా ఉంటే ఈమె తన కొడుకు పై విమర్శలు చేసేది కానీ ఎక్కడ కూడా జగన్ పేరును కూడా విజయమ్మ ప్రస్తావించకపోవడం తన కొడుకు పై తనకు ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: సరైన ప్రభుత్వాలు వస్తేనే అభివృద్ధి.. యువతకు పిలుపునిచ్చిన చిరంజీవి!

Published

on

Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా నేడు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ఓటు వినియోగించుకున్నటువంటి చిరంజీవి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతకు మంచి సందేశం అందజేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాయుద్ధం అయినటువంటి ఓటును యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో కూడా సరైన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.

Advertisement

ఓటు మన బాధ్యత..
ఇక చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితోపాటు ఎన్టీఆర్ అల్లు అర్జున్ శ్రీకాంత్ దంపతులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Advertisement
Continue Reading

Featured

AP Elections: ఏపీ ఎలక్షన్స్.. ఆ పార్టీకి భారీ షాక్ ఇవ్వబోతున్న ఉద్యోగులు.. మద్దతు వారికేనా?

Published

on

AP Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి విజయం ఎవరిది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగస్తులు అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలోనే ఉద్యోగస్తులందరూ కూడా ఎటువైపు ఉన్నారు. ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు కొంతవరకు మేలు చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా చేశారా అనే అపవాదం కూడా ఉంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50% ఉద్యోగాలను కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు మంచి చేశారు.

Advertisement

జగన్ కే మద్దతు..
ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఉద్యోగులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు ఇంకా మంచి చేస్తారని భావించి ఉద్యోగులందరూ కూడా జగన్ కే మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది. ఇక బాబును నమ్మి ఇప్పటికే ఎన్నోసార్లు మోసపోయారు మరోసారి మోసపోకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!