Connect with us

Featured

అదరగొడుతున్న అల్లు అర్జున్ సరికొత్త లుక్.. బన్నీ అంటే ఈమాత్రం ఉండాలి..!

Published

on

ఈ కాలం సినిమా స్టార్ లలో ఫ్యాషన్ ఐకాన్ అంటే అల్లు అర్జున్ అని చెప్పాలి..   ఎప్పుడు ఎదో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపొయింది.  అందుకే ఆయనకు స్టైలిష్ స్టార్ అని పేరు. అయన ప్రతి సినిమాలో కొత్త రకం ఫ్యాషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. దాన్ని ఇప్పటి యూత్ ఫాలో అవుతుంటారు.  సినిమా సినిమా కి కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్స్ ని పరిచయం చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు.. సినిమాల్లోనే కాకా బయట కూడా అయన వాడే వస్తువులు ఎంతో లేటెస్ట్ ఫ్యాషన్ తో ఉంటాయి.. దాన్ని తాము కూడా వదలని అభిమానులు ఆశపడుతుంటారు.

రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో తన సన్నిహితుడు పుట్టినరోజు వేడుకకి బన్నీ హాజరయ్యాడు. ఈ వేడుకలో బన్నీ లుక్‌ బయటకు వచ్చింది.  ఇప్పటి వరకు బయట బన్నీ కనిపించిన లుక్‌కి, ఈ లుక్‌కి పెద్ద తేడా లేదు. రగ్డ్‌గా కనిపిస్తున్న బన్నీ లుక్‌ చాలా కూల్‌గా ఉంది. బన్నీ కూల్‌ చూసిన తన ఫ్యాన్స్‌ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైర్‌ చేస్తున్నారు.

ఇక ఈ పుట్టిన రోజు వేడుకకి అల్లు అర్జున్ పెట్టుకున్న కళ్ళద్దాల పైన అందరు దృష్టి పడింది . ఇవి ఏ కంపెనీ గ్లాస్సెస్ అని ఎంత పెట్టి కొన్నాడని అభిమానులు వెతుకుతూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ధరించిన ఈ చలవ కళ్లద్దాలు ఖరీదు 20 వేలకు పైగానే ఉంటుందట. అంటే ఒక సాధారణ కుటుంబం నాలుగు నెలల పాటు హాయిగా బ్రతికేంత డబ్బు అన్నమాట. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శేషాల‌చ‌ల అడ‌వుల్లో మాత్రమే దొరికే ఎర్ర‌చంద‌నం, దానికి సంబంధించిన స్మ‌గ్లింగ్‌పై ‘పుష్ప‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు సుకుమార్ చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టీజర్‌ను బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Published

on

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Ap Politics: అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంత ప్రమాదమో భవిష్యత్తులో తెలుస్తాయి: శ్రవణ్ కుమార్

Published

on

Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్‌ కుమార్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆయన రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అని ప్రభుత్వ కార్యాలయాలను పడగొట్టడానికా కూటమికి అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు.

ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. రూల్‌ ఆఫ్‌ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అధికారులు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాయడం సరికాదని ఈయన తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా ఏ బిల్డింగులను కూడా కూల్చి వేయకూడదు అంతేకాకుండా కరకట్టపై ఉన్న బిల్డింగులకు ఏ ఒక్క బిల్డింగ్ కైనా అనుమతి ఉందా అంటూ ఈయన ప్రశ్నించారు.

2029 ఎన్నికలలో తెలుస్తుంది..
కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్‌ వేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా ఈయన ఖండించారు. అంతేకాకుండా అచ్చం నాయుడు ఇటీవల అధికారుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈయన స్పందించారు.అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజల ఆలోచనలకు కూడా విలువ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

Continue Reading

Featured

Kalki: ఏపీలో పెరిగిన కల్కి సినిమా టికెట్ల రేట్లు.. ఎంతంటే?

Published

on

Kalki: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు టికెట్ల రేట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.

అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కాలేదు అయితే నిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే కల్కి సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

అదనపు షోలకు అనుమతి..
ఇక కల్కి సినిమా విడుదలైన తర్వాత సింగిల్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయలను రెండు వారాలు పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రోజుకు ఐదు షోలు వేసుకొనే అనుమతి కూడా తెలియజేయడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!