Connect with us

Featured

ఆ ఘటన తన జీవితాన్నే మార్చింది.. ఓ మహిళ అ విజయ గాధ..!

ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఉన్నారు. అయితే వీరిలో కొందరు వారసత్వంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ

Published

on

ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఉన్నారు. అయితే వీరిలో కొందరు వారసత్వంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఇంతటి స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా కేవలం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు తన వ్యాపారాన్ని ఇతర దేశాలలో వ్యాపింపజేసే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు
కృతిక కుమరన్.

Advertisement

ఈమె పుట్టి పెరిగింది తమిళనాడులోని గోబిచెట్టిపాలయం అనే పట్టణంలో.తమిళనాడు తప్ప మరో రాష్ట్రం తెలియని కృతికకు 21 సంవత్సరాలకు పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు. ఈ క్రమంలోనే కృతిక తల్లి మంజులాదేవి తీవ్రమైన చర్మ సమస్యలతో బాధ పడేది.ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు స్టెరాయిడ్లు ఇచ్చేవారు. అధికంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడై ఆమె మరణించారు. ఈ విధంగా తల్లి మరణం కృత్తికను ఎంతో కృంగదీసింది.తన తల్లి లాగా మరొకరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో చేసిన ఆలోచన నుంచి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది.

ఆ ఐడియానే ఆర్గానిక్ సబ్బులు తయారు చేయడానికి అడుగులు వేసింది. తన తల్లి మరణానికి కారణం సభ్యులే అని తెలుసుకున్న కృతిక సహజసిద్ధంగా సభ్యులను తయారుచేయాలని భావించింది. ఈ క్రమంలోనే సహజసిద్ధంగా లభించే నూనెలు, మేక పాల సహాయంతో సభ్యులను తయారుచేసింది.తాను తయారు చేసిన సభ్యులను తమ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు ఉచితంగా ఇచ్చింది. అయితే అది మంచి ఫలితాలను చూపించటంతో ఆమె వ్యాపారానికి కొత్త దారిని పరిచయం చేసింది.

నేచురల్ కాస్మెటోలజీ కోర్స్‌లో చేరి వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకొని తన ఇంటిని ఒక ప్రయోగశాలగా మార్చి ఉత్పత్తులను తయారుచేసింది. ఈ విధంగా తాను తయారు చేసిన ఉత్పత్తులను 2017 వ సంవత్సరంలో విల్వా స్టోర్ ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.ఈ విధంగా ఈమె తయారు చేసిన సబ్బులలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజసిద్ధంగా లభించే నూనె మేక పాలతో తయారు చేయడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.

ప్రస్తుతం కృతిక సబ్బులలో మాత్రమే కాకుండా.. షాంపూలు, క్లీనర్స్, టోనర్,మాస్కులు, మాయిశ్చరైజర్లు, జెల్స్, లిప్ బామ్స్, కంటి ఉత్పత్తులను తయారు చేసే వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా సొంత వెబ్ సైట్ తో పాటు, అమెజాన్,నైకాలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారం ఇతర దేశాలకు పాకింది.ప్రస్తుతం తాను ఇంతటి విజయాన్ని సాధించింది అంటే తన విజయం వెనుక తన తల్లి దీవెనలు ఉన్నాయని కృతిక తెలిపారు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!