Connect with us

Featured

Chandrababu : క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. ప్రతిపక్షమే లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే..

Published

on

దాదాపు 163 సీట్లా? కలలో కూడా ఊహించని విజయమిది.. క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. ఐదేళ్ల అరాచకానికి చెంపపెట్టు… నోటి దురుసుకు తగిలిన దెబ్బ.. సంక్షేమానికి అందని ఫలాలు.. అభివృద్ధికే ఓటేసిన ఏపీ ప్రజానీకం.. పథకాలు కాదు.. ప్రాజెక్టులు కావాలన్న తపన.. రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వానికి వెన్నుపూస విరిచేసిన ఏపీ ప్రజానీకం… కొండంత ఆశ చూపి.. గోరంత కూడా చేయలేని చేతకాని తనానికి పెట్టిన చెక్.. ఉద్యోగాలు.. ఉద్యోగుల వెతలు పట్టని ప్రభుత్వాన్ని రెక్కలు విరిచేసిన ఏపీ ప్రజానీకం. ఇది ఒక్క వైసీపీ ప్రభుత్వానికే కాదు.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైన అతి పెద్ద గుణపాఠమే.

చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా?

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి పట్టువదలని విక్రమార్కుడే అయ్యారు. తనను జైలు పాలు చేసిన వైసీపీ అధినేతకు కొట్టకుండా తిట్టకుండా దెబ్బేశారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో సైకిల్‌ను దూసుకెళ్లేలా చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేశారు. ఒక మౌనమునిలా చంద్రబాబు ఇదంతా చేశారు. 23 ఏళ్ల తర్వాత కొడాలి నానిని ఇంటికే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదే. అసలు ఇంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎవరికీ అంతుబట్టడం లేదు. నిన్న మొన్నటి వరకూ ఎగిరెగిరి పడిన వైసీపీ నేతలు కనీసం బయటకు కూడా కనిపించడం లేదు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా? ముఖ్యంగా ఏపీని అర్థం చేసుకోవడంలో ఆయన అంతలా ఎలా సక్సెస్ అయ్యారు? 1994లో టీడీపీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు అంతకు మించిన విజయం దిశగా పార్టీని ఆయన ఎలా నడిపించగలిగారు? ఇదంతా ఎలా సాధ్యం?

Advertisement

క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్..

వైసీపీ అపజయాలన్నింటినీ జనాల్లోకి తీసుకెళ్లడంలో ముందుగా కూటమి సక్సెస్ అయ్యింది. ఆ తరువాత చంద్రబాబు అర్థం చేసుకున్న విషయం.. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్.. ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలదే హవా. కమ్మ కులాన్ని దాదాపుగా తన పక్కనే పెట్టుకున్నారు. జనసేన ద్వారా కాపులందరినీ ఏకం చేశారు. వైసీపీపై వ్యతిరేకతతో ఉన్న రెడ్లందరినీ టీడీపీలోకి లాగేశారు. ఇక దళితులపై జరిగిన అరాచకాలను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. బీసీలకు దక్కని గౌరవాన్ని వారికి తెలిసేలా చేశారు. ఇక్కడ కులమే కాదు.. అభివృద్ధి లేమి కూడా నూటికి నూరు శాతం పని చేసింది. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం కూడా ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది. మొత్తమ్మీద రాజధాని లేకుండా వైసీపీ చేస్తే.. ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చంద్రబాబు ఏపీని మార్చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Chandra Babu: టీడీపీ విజయంలో తెలంగాణ శ్రేణుల కృషి ఎంతో ఉంది: చంద్రబాబు

Published

on

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు రావాల్సిన అంశాల గురించి కీలక అంశాల గురించి ప్రస్తావించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

ఇలా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కి రావడంతో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భాగ్యనగరం మొత్తం పసుపు మయం చేశారు. ఇకపోతే హైదరాబాదులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ నాయకులతో కీలక నేతలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళతో సమానం అని తెలిపారు. తన విజయానికి టిడిపి శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ఈయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ఎంతో మంది నాయకులు వేరొక పార్టీలోకి వెళ్లారు కాని కార్యకర్తలు మాత్రం వెళ్లలేదని తెలిపారు.

Advertisement

టీడీపీకి పూర్వ వైభవం..
ఇకపోతే నాలెడ్జ్ ఎకానమీగా హైదరాబాదును తీర్చిదిద్దిన ఘనత టీడీపీదని తెలిపారు. మా పార్టీ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు దానిని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదని ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని తెలిపారు .పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎంగా ఆ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్న వైయస్ జగన్?

Published

on

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు.

2019 ఎన్నికలలో ఈయన ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికలలో కూడా అదే స్థాయిలో తమ విజయం ఉంటుందని భావించిన వైఎస్ జగన్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈసారి ఈయన కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఇలా 11 స్థానాలు రావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ స్పీకర్ కి లేఖ కూడా రాశారు. ఇక ఈ విషయంపై స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు అయితే ఇటీవల తండ్రి జయంతి ఉత్సవాల కోసం తాడేపల్లి నుంచి వైయస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. ఇలా పులివెందులకు వెళ్లినటువంటి ఈయన తన తండ్రి జయంతి వేడుకల సందర్భంగా షాకింగ్ న్యూస్ తెలియజేయబోతున్నారని సమాచారం.

Advertisement

పార్లమెంటుకు వైయస్ జగన్..
కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించడమే కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలను నిర్వహించి జగన్ ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే జగన్ ఉన్న ఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి ఈయన ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలనుకుంటున్నారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!

Published

on

Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ సీజన్ అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే అనగా ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని సమాచారం.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ సెట్ మొత్తం రెడీ చేస్తూ ఉండగానే మరోవైపు కంటెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈసారి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారితో పాటు ఎక్కువగా సీరియల్స్ వారికే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు సీరియల్ ఆర్టిస్టుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా మరొక ఆర్టిస్ట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొగలిరేకులు వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఇంద్రనీల్. ఈ సీరియల్ లో ఇంద్ర పాత్రలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్..
ఇక ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఈయన బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇంద్ర బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!