Director Parasuram: మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిఖిల్ హీరోగా యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ విధంగా పరశురామ్ దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?
ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరుశురాం వ్యక్తిగత విషయంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ సొంత బాబాయి కుమారుడే పరశురామ్.Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?
పరశురామ్ పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊళ్లో అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. తన నాన్న కో ఆపరేటివ్ బ్యాంకులో చిన్న ఉద్యోగిగా పని చేసేవారు తన తల్లి పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను చేసుకునేవారు.ఇలా ఒక రోజు కోళ్లకు వైరస్ సోకి పెద్దమొత్తంలో నష్టాలు వచ్చాయి.
ఆ డబ్బులతో పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశపడిన తన తల్లి కోరిక నెరవేరలేదు ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లల చదువులు కొనసాగాయి. అలా పరశురాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. ఇలా ఎంబీఏ చదువుతూనే ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్టైమ్ పని చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్ రావడంతో ఇంటికెళ్లి తన తల్లికి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో తనకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పడంతో తన స్నేహితులతో కలిసి రక్తం కూడా ఇచ్చారు.
Advertisement
ఈ విధంగా తన తల్లికి చికిత్స చేయించిన అనంతరం తిరిగి వచ్చిన పరశురామ్ కు మరో పది రోజుల వ్యవధిలోనే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని కబురు రావడంతో పూర్తి స్థాయి పరీక్షలు చేయించిన పరుశురామ్ ఒక చేదు వార్త తెలిసింది.తన తల్లి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని మూడు నెలలకు మించి బతకరని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది.
ఈ విధంగా డాక్టర్లు చెప్పడంతో తన తల్లిని హైదరాబాద్ తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించిన చికిత్స స్పందించారు.అయితే ఈ విషయం తెలిసిన ఆమె ఆరు నెలలకు మృతి చెందారు. ఈ విధంగా బ్లడ్ క్యాన్సర్ తో తన తల్లి మృతి చెందడంతో ఉన్న ఆస్తులను అమ్మి తన అక్కకు పెళ్లి చేశారు.ఇక ఈయన కూడా హైదరాబాద్ వచ్చి పూరి జగన్నాథ్ సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.