Connect with us

Featured

వందల సినిమాలలో నటించిన కల్పనా రాయ్ లాంటి వారు అంత్యక్రియలకి కూడా డబ్బులేని ధీన స్థితిలో లోకాన్ని వీడి వెళుతున్నారు.. దానికి కారణాలు ఇవేనా పాపం!

Published

on


సినిమా ఇండస్ట్రీలో సుధీర్గ ప్రయాణం కొనసాగి దాదాపు 350 నుంచి 400 సినిమాలలో నటించిన నటీ నటులు ఎందరో చివరి చూపుకు నోచుకోకుండా, ఆఖరికి అంత్యక్రియలకి కూడా డబ్బు లేని ధీన స్థితిలో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వయసున్నా, ముసలితనం వచ్చినా కొందరు సినీ తారలకి డబ్బు, హోదా ఉంటే ఎవరైనా పలకరిస్తారు.. చుట్టపు చూపుకి నోచుకుంటారు. లేదంటే ఈగలను తోలుకుంటూ బ్రతకాల్సిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ రంగుల ప్రపంచంలో ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు. ఈ విషయం ఇప్పటికే ఎంతోమంది స్వయానుభవాలను చెప్పిన సందర్భాలున్నాయి.

వచ్చేటప్పుడు ఎలా వస్తామో పోయేటప్పుడు అలానే పోతాము. ఇదే నిజం. మధ్యలో బ్రతికేదంతా మన ఊపిరి తీసుకొని వదిలేటువంటి జీవితమే. ఊపిరి తీసుకున్న వారు మళ్ళీ వదిలేలోపే అనంతలోకాలకి వెళ్ళినవారున్నారు. అలా వదిలిన ఊపిరి తీసుకునే లోపూ కళ్ళు మూస్తున్న వారూ ఉన్నారు. కానీ ఈ సత్యం అందరికీ తెలియడం లేదు. అందుకే ఈర్ష్యా భావాలతో బ్రతికేస్తున్నారు. సినిమా వాళ్ల జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని అందరూ అనుకుంటుంటారు. కానీ మావి కూలి బ్రతుకులే అని కొందరు
చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేం ఫేం ఉన్నంతవరకే సెలబ్రిటీ.

అవి పోయాయంటే అందరూ దూరమవుతారు. మంచి మంచి సినిమాలు చేస్తూ బాగా సంపాదించిన వారు ఇతరులకి దానం చేయడం వల్ల తమ వద్ద ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి ఒకరి చేయూత కోసం ఎదురు చూస్తూ ఎవరైనా వచ్చి ఆదుకుంటే బావుంటుందని ఎదురు చూస్తున్న వారు ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అలాంటి వారిలో దివంగతనటి కల్పనా రాయ్ కూడా ఉన్నారు. ‘ఓ సీత కథ’ చిత్రంతో తెలుగు చిత్రరంగంలో అడుగు పెట్టిన ఆమె దాదాపు 450 చిత్రాలలో హాస్య ప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

400 పై చిలుకు చిత్రాలంటే సాధారణంగా ఏ నటి, నటులకైనా ఆస్తులు బాగానే ఉండి ఉంటాయని అనుకోవడం సహజం. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే పేరుకే 400 చిత్రాలలో నటించినా అందులో ఎన్ని చిత్రాలకి సరైన రెమ్యునరేషన్ అందుకొని ఉంటారు..అంత మంది సినిమాలలో పాత్రలు పూర్తయ్యాక ఎగ్గొట్టిన వారుంటారు.. ఆలోచిస్తే కల్పనా రాయ్ లాంటి వారు చివరి దశలో ఆర్ధిక కష్టాలను ఎందుకు అనుభవించారో అర్థమవుతుంది. ఇలాంటి చిన్న ఆర్టిస్టులకి కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం రెమ్యునరేషన్ అనే మాట లేకుండా సినిమాలు చేస్తుంటారు.

కాస్త పేరొచ్చాక డిమాండ్ చేద్దామంటే తమకొచ్చే అవకాశాలు ఎక్కడ కొత్తవారొచ్చి దక్కించుకుంటారో అనే భావన. కొన్ని సినిమాలు చేసి మంచి రెమ్యునరేషన్ ఇచ్చినా ఇంట్లో బాధ్యతలకో, మానవతా దృక్పథంతో సమాజ సేవకో ధారాదత్తం చేసేయడం.. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోయి రేపు తెల్లవారితే కదా మనకి అవసరం వీరికి ఇప్పుడు పూట గడవాలి కదా అనే ఆలోచనతో ఉన్నదంతా ఇచ్చేయడం.. ఇలాంటి సహాయాలు చేసి చివరికి దిక్కు మొక్కూ లేకుండా కఠిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకు ఉదాహరణ సావిత్రి లాంటి వారే.

కల్పనా రాయ్ కూడా చాలా సినిమాలకి రెమ్యునరేషన్ లేకుండానే నటించారట. వచ్చిన డబ్బు కాస్తో కూస్తో దాచుకోకుండా ఇతరులకి ఖర్చు చేసేవారని చెప్పుకుంటారు. అందుకే ఆమె అనారోగ్యం బారిన పడినా మందులు కొనుక్కోలేని పరిస్థితి గడపాల్సి వచ్చిందట.

వయసైపోయిన ముసలావిడ కాబట్టి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని.. చివరికి ఆమె మరణించాక తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన అంత్యక్రియల కోసం 10 వేల రూపాయలు కేటాయించింది. ఇలా చివరి దశను అనుభవిస్తున్న నటీ నటులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!