Connect with us

Featured

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు.

Published

on

Krishnam Raju : ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, ఎవరీయన అని అనుకుంటారేమో అక్కడికే వస్తున్నాం, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ‍యన తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినిమా కథానాయకుడిగా, రాజకీయవేత్తగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు కృష్ణంరాజు. క్షత్రీయ రాజుల వంశస్తులు, విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. యాంగ్రీ యంగ్ హీరోగా, రెబల్ స్టార్‌గా తెలుగు తెరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు కృష్ణంరాజు. ఇప్పటి వరకు సుమారు 187 సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. చిలకా గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈయన. అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలల్లో నటించి అద్భుత విజయాలను సాధించారు. ఇప్పటి వరకు చేసిన 187 సినిమాల్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. అందులో కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement
Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్.

1976లో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణం రాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప కథ కృష్ణంరాజు కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ఇది. అసలు దేవుడంటేనే పడని కన్నప్ప ఓ చిన్న సంఘటనతో తనలోని భక్తి భావాన్ని ప్రదర్శించే చిత్రం ఇది. సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భక్తి రసవత్తరమైన చిత్రంలోనూ నటించి మెప్పించగలరని రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ చిత్రం ద్వారా నిరూపించారు.

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1984 సంవత్సరంలో నిర్మించిన చిత్రం బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమాలో బొబ్బిలి బ్రహ్మన్నగా కృష్ణంరాజు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. పరుచూరి సోదరులు అందించిన కథ, మాటలు చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ ఇదే కొనసాగుతుంటుంది. ఎన్నో సమస్యలు వాటికి సరైన పరిష్కారాలను చూపే క్రమంలో నాటకీయంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా  అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా కృష్ణంరాజు నట జీవితంలో బొబ్బిలి బ్రహ్మన్నగా పోషించిన కథానాయక పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్.

1987లో కటకటాల రుద్రయ్య సినిమా విడుదలైంది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు కథానాయకుడిగా జయసుధ, జయచిత్ర కథానాయికలుగా నటించారు. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డె శోభనాద్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.వి.రాఘవులు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్‌ను రాబెట్టగలిగింది. కృష్ణంరాజు నటించిన 93వ చిత్రం ఇది. ఈ చిత్రం కథ కూడా వినకుండా కృష్ణంరాజు నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. దాసరి నారాయణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో కటకటాల రుద్రయ్య బాక్సాఫీస్‌నే ఓ ఊపు ఉపేసింది. 26 సెంటర్లలో 50 రోజులు 8 కేంద్రాల్లో 100 రోజులు సినిమా ఆడి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాణానికి 18 లక్షలు ఖర్చు చేస్తే ఏకంగా 75 లక్షలను వసూలు చేసింది. ఈ క్రేజ్‌తోనే 1979లో తమిళంలో శివాజీగణేషన్‌, జయసుధ, శ్రీదేవిలతో, వి.బి.రాజేంద్రప్రసాద్ పట్టాకత్తి భైరవన్ గా మళ్ళీ సినిమాను తీశారు. హిందీలోనూ 1989లో దారసి దర్శకత్వ సారథ్యంలో జితేంద్ర హీరోగా జ్యోతిబనేజ్వాల అనే పేరుతో సినిమాను పున: నిర్మించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కటకటాల రుద్రయ్య ఎంతటి ప్రేక్షకాదరణను పొందిదో.  

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్.

Krishnam Raju : పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

 1988లో కృష్ణం రాజు నటించిన అంతిమతీర్పు సినిమా విడుదలైంది. మలయాళ డైరెక్టర్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సినీ కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకమైంది. మమ్ముటి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్‌లోనూ మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. స్వార్థ రాజకీయాలకు బలైన పాత్రలో కృష్ణంరాజు తన నటతో ప్రేక్షకులను మెప్పించారు. నా అన్నవారిని పోగొట్టుకుని, అంగవైకల్యానికి గురైనా తన నిజాయితీతో నమ్ముకున్న జర్నలిజాన్నే ఆయుధంగా మలుచుకుని సొంతంగా ఓ పేపర్‌ను స్థాపించి తనను ఆ స్థితికి తీసుకువచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ అంతిమతీర్పు చిత్రకథాంశం. 

Krishnam Raju : తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్.

ఈ చిత్రానికి క్యారెక్టర్‌కి కృష్ణంరాజు న్యాయం చేశారు. అదే చిత్రం తన కెరీర్‌కే అప్పట్లో ప్లస్ పాయింట్ అయ్యింది. జి.జె పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించి నటనకు నిలువెత్తు రూపంలా నిలిచారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇవి కేవలం మచ్చుతునకలే ఇలా మరుపురాని, మరిచిపోలేని ఎన్నో సినిమాల్లో నటించి నటనతో మెప్పించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. అంతటితో ఆగిపోలేదు తన నటవారసత్వాన్ని అందిస్తూ యువ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ తన సినీ కెరీర్లో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రెబల్ స్టార్‌లు ఇద్దరూ రాధేశ్యామ్‌లో నటించారు. ఇటీవల రాధేశ్యాం ప్రమోషన్లలో అయన పాల్గొన్నారు. అయితే శ్వాశకోశ సమస్యలతో బాధపడుతున్న అయన ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!