Connect with us

Featured

Raja Babu : నిర్మాతగా మారడమే రాజబాబు కెరీర్ దెబ్బతినడానికి కారణమా..?

Published

on

‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో అప్పటికే పేరు పొందిన పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి నటులతో కలసి రాజబాబు నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో అప్పటి వరకు హాస్య నటులంటే పద్మనాభం, అల్లు రామలింగయ్య అని చెప్పుకున్న వారంతా అప్పటి నుంచి రాజబాబు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో అప్పటి అగ్రతారలందరి సినిమాలలో పలు కీలక పాత్రలు పోషించే అవకాశాలను అందుకున్నారు. రాజబాబు, రమాప్రభ జంట ఎన్నో చిత్రాలలో నటించి హిట్ పెయిర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.

Raja Babu : నిర్మాతగా మారడమే రాజబాబు కెరీర్ దెబ్బతినడానికి కారణమా..?

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. దర్శకుడిగా దాసరికి, నటులుగా ఎస్వీ రంగారావు, రాజబాబులకు గొప్ప పేరొచ్చింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా నటించారు. “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఈ క్రమంలోనే ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు.

Raja Babu : నిర్మాతగా మారడమే రాజబాబు కెరీర్ దెబ్బతినడానికి కారణమా..?

మంచి క్రేజీ స్టార్‌గా మారడంతో మంచి రెమ్యునరేషన్ అందుకున్నారు. దాంతో సొంతగా ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో రాజబాబు రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ సూపర్ హిట్ సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘రాధమ్మ పెళ్ళి’ సినిమాలో రాజబాబు, రమాప్రభ సొంత గొంతుతో ‘కాకినాడ రేవు కాడా ఓడెక్కి…’ అనే పాట పాడటం విశేషం. ఈ పాట గురించి అప్పట్లో ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారు.

Raja Babu : నిర్మాతగా మారడమే రాజబాబు కెరీర్ దెబ్బతినడానికి కారణమా..?

ఆ తర్వాత కూడా రాజబాబు కొన్ని పాటల్లో స్వయంగా తన గొంతు వినిపించారు. అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు అనేవి లేవు. ఉంటే గనక ఎన్ని అవార్డులను దక్కించుకునేవారో చెప్పలేము. అయితే, రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ కొన్ని సాంస్కృతిక సంస్థలు పలు అవార్డులు ప్రకటించారు. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా 5 ఏళ్ళు అందుకున్న ఘనత ఒక్క రాజబాబుదే కావడం గొప్ప విశేషం. ఇక రాజబాబు, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు కావడం మరో విశేషం. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి అవుతుంది.

Raja Babu : నిర్మాతగా మారడమే రాజబాబు కెరీర్ దెబ్బతినడానికి కారణమా..?

అలాగే, గాయని రమోల కూడా రాజబాబు భార్యకు సోదరి అవుతారు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. వీరిద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా ప్రేక్షకులకు సుపరిచితులు. ఇక రాజబాబు మీద కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఆయన సినిమాలను నిర్మించడం వల్ల చాలా నష్టపోయారని, తన కుటుంబానికి ఏమీ సంపాదించలేదని కొన్ని సార్లు ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఆయన తన పిల్లలకోసం స్థిరాస్థులను బాగానే సంపాదించి పెట్టారు. వారి జీవితాలను చక్కదిద్దారు. ఏ లోటు లేదని చాలా తక్కువమందికి తెలుసు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!