Connect with us

Featured

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

Published

on

Prashanth Neel background : చేసింది మూడు సినిమాలే అయినా రెండో సినిమాకే ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అప్పటి వరకూ బాలీవుడ్ డామినేషన్ చూసిన ఇండియన్ సినిమా మొదటిసారి అసలైన పాన్ ఇండియా సినిమా చూసింది. సౌత్ ఇండస్ట్రీ సత్తాని ముంబైలో మాట్లాడుకునేలా చేసింది ప్రశాంత్ నీలే . శాంతి నేను తీసిన సినిమాల సంఖ్య చిన్నదే అయినా తాను అడుగు పెట్టిన తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ పెద్దదయింది.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ప్రశాంత్ నీల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి…..

ప్రశాంత్ నీల్ కర్ణాటక లోని హసన్ జిల్లా వాసి. చిన్నప్పటి నుండి సినిమాలవైపు రావాలనో డైరెక్టర్ అవ్వాలనో కలలు కనలేదు . బుద్దిగా చదువుకొని మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాడు. ఇంట్లోని పరిస్థితులు అవస్థలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు.కానీ “అంతా డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ.., డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు” అని ప్రశాంత్ నీల్ అప్పుడే ఆలోచించాడు. అందుకే సినిమాల్లోకి వెళ్లాలని అనుకుని డైరెక్టర్ కోర్స్ చేసి కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ఎన్నో ఆశలతో వచ్చిన ప్రశాంత్ కు కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నదనే విషయం తెలియదు.

Advertisement
Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ఇక ఉగ్రమ్ సినిమా తీసాడు కాని విడుదలకు బాగా కష్టాలు పడ్డాడు, నిర్మాతలు విడుదల సమయంలో చేతులు ఎత్తేయడంతో ఉగ్రమ్ విడుదల ఆగిపోయింది. ఇక ఎపుడు కన్నడ సూపర్ హీరో దర్శన్ సహాయంతో సినిమాను విడుదల చేసారు ప్రశాంత్ నీల్ 2014 ఫిబ్రవరి 21న ‘ఉగ్రమ్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఉగ్రమ్ విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పుట్టాడు. అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్ళీ కొత్తపుంతలు తొక్కింది.ఉగ్రమ్ సినిమా కాసుల వర్షం కురిపించింది.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ఇక కన్నడ సినీ ఇండస్ట్రీ చాలా చిన్నదని అర్థమైన ప్రశాంత తన నెక్స్ట్ సినిమాతో బాలీవుడ్ లో తన పేరు వినపడేలా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కేజీఎఫ్ ఆ కలను నెరవేర్చడం కాదు… కేజీఎఫ్ తో ప్రశాంత్ ఎవరని ఆరా తీసేలా చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమా అర్థం చెప్పాడు. కన్నడ హీరోను పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. ఒక్క మాతృ భాష కన్నడ లోనే 250 కోట్లు వసూలు చేసి కన్నడ మార్కెట్ ను పెంచేసింది కేజీఎఫ్. “పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”. ఏదో కేజీఎఫ్ డైలాగ్ కానీ ప్రశాంత్ మాత్రం తానొచ్చిన ప్లేసులో ను పవర్ ఫుల్ చేసాడు. కానీ కేజీఎఫ్ గాలివాటు గా వచ్చిన విజయం కాదు దానికోసం ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. ప్రశాంత్ తన సినిమా ప్రొమోషన్స్ కోసం జక్కన్న ను కలవాలని అనుకున్నాడు.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

అయితే యష్, ప్రశాంత్ కు అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి కనిపించడంతో యష్ తనను తాను పరిచయం చేసుకుని సినిమా గురించి ప్రశాంత్ గురించి చెప్పాడు కానీ రాజమౌళికి అవేవి వినిపించలేదు. కేవలం ప్రశాంత్ అన్న పాన్ ఇండియన్ మూవీ అన్నది మాత్రమే వినిపించింది. ఇక 15నిమిషాల యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ ప్రశాంత్ రాజమౌళికి అవేమి వినిపించలేదు కేవలం ఆ సన్నివేశాల్లో మునిగిపోయారు. అంతే ఇక కేజీఎఫ్ నచ్చడంతో రాజమౌళి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆయన మదిలో ఉన్నా పాన్ ఇండియా కల ఇలా నెరవేర్చాలని డిసైడ్ అయ్యారు.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

2018 డిశెంబర్ 21న కె.జి.యఫ్‌ ప్రేక్షుకుల ముందకు వచ్చింది. సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తూఫాన్ కాదు ఏకంగా సునామి సృష్టిస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. ఎక్కడైనా సినిమాలో హీరో ఎలివేషన్ ఉంటుంది కానీ హీరో ఎలివేషన్ లో సినిమా కథని చూపించాడు ప్రశాంత్ నీల్ ఇక ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక కేజీఎఫ్ ఫ్రాంచైస్ తో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ డామినేషన్ ను అణచడానికి వచ్చిన మరో రాజమౌళిల కనిపిస్తున్నాడు.

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!