Connect with us

Featured

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ ! ఎంతో నమ్మి వాడికి పనిస్తే.. ఇలా చేస్తాడని అనుకోలేదు : తమన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Published

on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతలో వీరికి పిడుగులాంటి షాక్ తగిలింది. ఈ సినిమాలోని కళావతి సాంగ్ ను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ప్రేమికుల రోజున విడుదల చేసి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మూవీ మేకర్స్ కు లీక్ రాజాలు షాక్ ఇచ్చారు. నెట్లో ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రతీది లీక్ అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌.. నేడు మొదటి లిరికల్ సాంగ్.. ఇలా ప్రతీది పైరసీ బారిన పడుతోంది. మొదటి నుంచి కూడా పైరసీ సినిమా రంగాన్ని వదిలి పెట్టడం లేదు. ఇలా సినిమా విడుదల కాకముందే లీక్ ల ద్వారా పాటలు, పోస్టర్లను విడుదల చేయడంతో.. అభిమానులు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ..

ఇదిలా ఉండగా.. దీనిపై సంగీత దర్శకుడు థమన్ తీవ్ర ఆవేదన చెందారు. ఇలా జరగడం తనను ఎంతో బాధ కలిగించిందని.. ఈ పాట కోసం దాదాపు 6నెలలు కష్టపడ్డామన్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపాడు. ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చిందని తెలిపారు. అందుకే మధ్యలో షూటింగ్ నిలిపివేసి.. మళ్లీ స్టార్ట్ చేశామని అన్నారు.
ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా సింపుల్ గా నెట్టింట్లో విడుదల చేశారు.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె పగిలినంత పనైంది అంటూ ఆవేదన చెందాడు. తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని.. తన లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను… కానీ ఈ విషయంపై తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు. పైరసీ అంటే ఎంత ఘోరమైన చర్యో తెలియాలనే తాను ఈ ఆడియో నోట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నానని.. ట్విట్టర్ ఖాతాలో అతడు తన ఆడియో ఫైల్ ను షేర్ చేశాడు. ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!