Connect with us

Featured

Flash Back : ఐటెం సాంగ్స్ చేసే నటీమణులను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే.!

Published

on

Flash Back : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడం కోసం చాలా రకాల పాత్రలను చేసి మంచి గుర్తింపును సాధించుకుంటారు ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కోరుకుంటూ ఎవరూ చేయని భిన్నమైన కథలను ఉంచుకొని చేయాలి అనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ మంచి కథలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అయితే అలాంటి పరిస్థితిలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. అప్పుడప్పుడు వారు కొన్ని వైవిధ్యమైన చిత్రాలను చేసి మంచి హీరోలు అనిపించుకున్నప్పటికీ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు.

కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో లెక్కలు మారిపోయాయి. చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది అని చెప్పాలి. కొత్త సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న చాలామంది దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి సక్సెస్ ఫుల్ సినిమాలుగా మార్చుకుంటున్నారు. అలా చాలా మంది దర్శకులు హీరోలుగా మంచి సక్సెస్ లు కొట్టి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు సినిమాల్లో ఐటంసాంగ్స్ చేయడానికి ఐటం బామలు సపరేట్ గా ఉండేవారు. వారు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తూ జనాలని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ సినిమా సక్సెస్ సాధించడంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ ఉండేవారు.

ఒకప్పుడు జయమాలిని లాంటి వారు వ్యాంపు క్యారెక్టర్ లో చేస్తూ మంచి గుర్తింపు పొందారు. వాళ్ల తరువాత సిల్క్ స్మిత కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేస్తున్న టైంలోనే డిస్కోశాంతి కూడా ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ లు హీరోయిన్స్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేస్తూ హీరోయిన్ గానే కాకుండా ఐటం బామలుగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోలుగా నటులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కొంత మంది ఐటెం భామలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఒకసారి మనం చూద్దాం..

Advertisement

శ్రీహరి – డిస్కో శాంతి

శ్రీహరి ఇండస్ట్రీకి వచ్చిన మొదట విలన్ గా వేషాలు వేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుని ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాలు అన్ని రియల్ గా చేసి ప్రేక్షకుల్ని అలరించేవారు. అందులో భాగంగా భద్రాచలం లాంటి సినిమా లో ఆయన పోషించిన పాత్ర కి మంచి పేరు రావడంతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే అప్పుడు ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో శ్రీహరి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.

జెడి చక్రవర్తి – అనుకృతి శర్మ

హీరోగా తెలుగులో మంచి గుర్తింపు పొందారు జె.డి.చక్రవర్తి. శివ సినిమాతో విలన్ గా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత హీరోగా మంచి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా లాంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి గుర్తింపు పొందారు. వాళ్ల గురువైన రాంగోపాల్ వర్మ తీసిన శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించిన అనుక్రూత శర్మని పెళ్లి చేసుకున్నారు జేడీ చక్రవర్తి..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!