Connect with us

Featured

Anu Aggarwal : ప్రపంచం మొత్తం దాసోహమన్న ఆ హీరోయిన్ పరిస్థితి ఎంత ధారుణంగా మారిందో తెలుసా?

Published

on

Anu Aggarwal : అను అగర్వాల్… ఒకప్పుడు ఈమె బాలీవుడ్లో తిరుగులేని రారాణిగా ప్రఖ్యాతి చెందింది. ఆషీకీ ఈ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె మొదటి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశంలోని ప్రతి సినిమా ప్రేక్షకులకి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అను అగర్వాల్ జనవరి 11, 1969 న ఈవిడ జన్మించారు. ఈవిడ 1990 సంవత్సరంలో ఆషీకీ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సినిమా 2 సంగతులను మనకు ఇచ్చింది. అందులో మొదటిది ఎప్పుడు మరిచిపోలేని పాటలు, మరొకరు హీరోయిన్ అను అగర్వాల్. అయితే ఈ సినిమా చేయకముందు అను అగర్వాల్ తను అసలు ఎప్పుడూ హీరోయిన్ కావాలని అని అనుకోలేదు. అయితే దర్శకుడు మహేష్ భట్ ప్రోత్సాహంతోనే ఆవిడ సినీ పరిశ్రమలోకి వచ్చింది. ఆషీకీ సినిమాను ముందుగా తనకు వివరించిన తను ఒప్పుకోలేదు. కాకపోతే ఏడు నెలల తర్వాత మళ్లీ మహేష్ భట్ అను అగర్వాల్ కు ఫోన్ చేసి నువ్వు ఈ సినిమా చేయకపోతే నేను ఈ సినిమా తీయను అని చెప్పడంతో ఆమె ఆ సినిమాల్లో నటించింది.

అయితే ప్రస్తుతం ఈవిడ ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు అన్న సంగతి విషయానికొస్తే…. నిజానికి ఈమె జీవితం అచ్చం సినిమా స్టోరీలా ఉంటుంది. మొదటగా ఈవిడ జన్మించింది ఢిల్లీలో. కానీ తల్లిదండ్రుల కారణంగా ఆవిడ చెన్నైలో కొద్ది రోజులు ఉండగా మళ్ళీ తిరిగి ఢిల్లీలో సోషియాలజీ సబ్జెక్టులో డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ సమయంలోనే ఆవిడ మంచి అందగత్తె అవడంతో స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి లేదా మోడలింగ్ లో వెళితే తన భవిష్యత్తు బాగుంటుందని అప్పట్లో తన స్నేహితులు ఆమెకు తెలియజేశారు. దీనితో ఆవిడకు ముందుగా సినిమాలు చేయడానికి ఇష్టం లేకున్నా మోడలింగ్ చేద్దామని తను ముంబైకి వచ్చింది. ఆ తరుణంలో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మోడల్ గా పని కూడా పని చేసింది. 1988వ సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్లో వీడియో జాకీగా ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె అభినయం అందం చూసి వద్దు వద్దు అన్న గాని సినిమా ఆఫర్లు ఆమెకు వెంటనే వచ్చాయి. ఇక ఇదే తరుణంలో 1990 సంవత్సరంలో మహేష్ బాబు నిర్మించిన ఆశిక్ ఈ సినిమా ద్వారా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత ఇక ప్రతి డైరెక్టర్ ఆమెతో సినిమా తీయాలని బారులుతీరారు. కానీ అవన్నీ ఆమె పక్కన పెట్టి వరల్డ్ టూర్ వెళ్లి వచ్చాక మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయాలని భావించి వాళ్ళు టూర్ కి వెళ్ళిపోయింది. అలా వెళ్లొచ్చాక ఆవిడ డేట్స్ ఇస్తే చాలు అన్నట్లుగా ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధమైపోయారు.

ఇలా అనేక సినిమాల్లో ఆమెకు ఛాన్స్ వచ్చినా కేవలం తనకు నచ్చిన సినిమాలోనే ఎంచుకొని సంవత్సరానికి ఒక సినిమా లాగే సినిమాలు చేస్తూ వచ్చారు. అలాగే 1993వ సంవత్సరంలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తో తమిళంలో తిరుధ తిరుధా అనే సినిమా, అదేనండి మన తెలుగు లో దొంగ దొంగ సినిమా పేరుతో వచ్చిన సినిమాని అప్పుడు ఆమె అంగీకరించింది. ఆ సినిమాలోని కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి అన్న పాట ఇప్పటికీ మనకు సుపరిచితమే. అయితే ఇక 1994వ సంవత్సరంలో మన తెలుగు డైరెక్టర్ అయినా మణి కౌల్ అనే దర్శకుడు ది క్లౌడ్ డోర్ అనే ఇండో-జర్మన్ సినిమాని తీశారు. ఇక ఆ సినిమాలో అను అగర్వాల్ పూర్తిగా న్యూడ్ గా నటించింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ గా కూడా మారింది. దీనితో ఆ సినిమా మా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా కేన్స్ చిత్రోత్సవాల్లో కూడా ఆ సినిమాను ప్రదర్శించడం జరిగింది.

అలా కొద్దిగా సినిమాలు చేస్తూ చేస్తూ ఆమెకు సినిమా అంటేనే కాస్త బోర్ కొట్టడంతో అలా కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చి మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకుని ఉన్న రోజుల్లో ఆమెకు ముంబైలో అనుకోని విధంగా భారీ యాక్సిడెంట్ జరిగింది. ఇక ఆ ఆక్సిడెంట్ లో అను అగర్వాల్ పూర్తిగా దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్లి పోయింది. ఇక శరీరంలో మొత్తం ఇరవై తొమ్మిది చోట్ల ఎముకలు విరిగి అయితే ఆమె పరిస్థితి అర్థం చేసుకోండి. అనేక శస్త్రచికిత్సలు, అనేక మంది డాక్టర్ల నిపుణుల సూచనల మేరకు ఆరు సంవత్సరాల తర్వాత ఆమె కోలుకోవడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ఆరు నెలల వరకు ఆమె కోమాలోనే ఉండిపోయింది. కోమాలో నుంచి బయటికి వచ్చిన ఆమె ముఖం ఆమె చూసుకోవడానికి చాలా భయపడింది. అలాంటి సంఘటన నుంచి బయటికి తేరుకొని చూడగానే ఆమెకు పూర్తిగా తన గతాన్ని మర్చి పోయింది.

ఆరు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమెకు తన గతాన్ని గుర్తుకు వచ్చింది. ఆ ఆరు సంవత్సరాల్లో ఆమె నరకం భూమి మీద ఉండగానే చూసిందని అని చెప్పవచ్చు. తన కుడిచేయి పని చేయకపోవడంతో ఆవిడ పనులన్నీ ఎడమ చేతితోనే చేసుకునేది. ఆ తర్వాత యోగతో తన ఒత్తిడిని పూర్తిగా తొలగించుకుంది. ఇక ఆమె తన శరీరంతో పెద్ద యుద్ధమే చేసిందని చెప్పవచ్చు. అనూ ఫన్ అని యోగ పేరుతో సొంతంగా ఒక హీలింగ్ పద్ధతిని తయారుచేసింది. ఆ తరువాత వైద్యుల సహకారంతో పూర్తి మనిషి అయింది ఆవిడ. యోగ, తాంత్రిక సెక్స్ తనను మాములు మనిషిని చేసిందని తన తర్వాత రచించిన ఆత్మకథలో వివరంగా చెప్పింది. ఇక ఆ తరువాత ముంబైలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను, పిల్లలను పలకరిస్తూ వారికి యోగా, జీవితం పట్ల సూచనలు ఇస్తుంది. ఇలా ఆవిడ ప్రస్తుత జీవితం ముంబైలో కొనసాగిస్తుంది. అయితే ఇంతకు ముందు సినిమాలు చేసిన ఆమెతో వారు ఇప్పుడు ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!