Connect with us

Featured

Noel Ex Wife: అది భరించలేకనే.. పెళ్ళైన ఆరు నెలలకే విడాకులకు తీసుకున్నా..! : ఎస్తర్

Noel Wife: టాలీవుడ్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి అందరికీ తెలిసిందే ఈయన సింగర్, నటి ఎస్టర్ వాలెరీ నోరోన్హాను

Published

on

Noel Ex Wife: టాలీవుడ్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి అందరికీ తెలిసిందే ఈయన సింగర్, నటి ఎస్టర్ వాలెరీ నోరోన్హాను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె పలు కన్నడ సినిమాలలోను నటించారు అదేవిధంగా తెలుగులో భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఇక ఆది సాయి కుమార్ నటించిన గరం సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సందడి చేసిన ఈమె సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరి పెళ్లి జరిగిన ఆరు నెలలకే వీరు విడాకులు తీసుకొని అందరినీ షాక్ కి గురి చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?
Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్టర్ వాలెరీ నోరోన్హా తన విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.నా జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే ఒక పెద్ద డెసిషన్ అని అయితే ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్న తర్వాత నా జీవితం ఇంత తొందరగా విడాకులతో ముగిసిపోతుందనీ ఎప్పుడు అనుకోలేదు అని తెలియజేశారు.

అబద్ధాలు చెప్పడం నచ్చలేదు…

అయితే పెళ్లి అయిన ఆరు నెలలకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర చెప్పడం కరెక్టా కాదా అని ఎన్నోసార్లు ఆలోచించానని ఇక చివరికి తాను తీసుకున్న నిర్ణయం మంచిదని భావించి విడాకులు తీసుకున్నానని తెలిపారు.ఇక నోయల్ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఎన్నో కారణాలు ఉన్నాయని ముఖ్యంగా నేను ఒకే ప్రశ్నను ఎన్ని సార్లు అడిగిన తన దగ్గర నుంచి ఎన్నో రకాల సమాధానాలు వస్తాయని,చివరికి నేనే తప్పుగా మాట్లాడుతున్న అనే సందేహం తనలో వస్తుందని అందుకే ఆయన అలా అబద్ధాలు చెప్పడమే విడాకులకు కారణమైందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఏది ఏమైనా పెళ్లి అయిన ఆరు నెలలకే ఇలా విడాకులతో విడిపోవడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు.

Advertisement

Featured

Rajamouli: ప్రభాస్ సినిమా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్!

Published

on

Rajamouli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించి గత విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ప్రభాస్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అని చెప్పాలి ఈయన దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాని ద్వారా రాజమౌళి ఎవరు చేయని సాహసం చేశారు.

అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా క్రేజీ లేదు అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో లేరు అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహంతోనే రాజమౌళి తనపై తాను నమ్మకం ఉంచి ఈ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా నార్త్ లోకి మంచి ఆదరణ పొందినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

నెగటివ్ టాక్..
ఇలా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో తాను చాలా కంగారపడ్డానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానని తెలిపారు. కానీ రాజమౌళి విజినరీ ముందు నెగిటివ్ టాక్ కొట్టుకుపోయి ప్రతి ఒక్కరు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే టాక్ కారణంగా సినిమా చూడటానికి వెళ్లి ఈ సినిమాని విజయవంతం చేశారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?

Published

on

Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పత్రికా అధినేత రామోజీరావుకు సంస్కరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభను నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రామోజీరావుకు సంస్కరణ సభ ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్సిపి నేత హైకోర్టు న్యాయమూర్తి నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణ సభలు నిర్వహించలేదు కానీ పత్రికా రంగం అధినేత రామోజీరావుకు ఎందుకు ప్రభుత్వం తరఫున సంస్కరణ సభ నిర్వహించారని ప్రశ్నించారు. ఈయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ సభను నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ సంస్కరణ సభ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు ఎంతగానో దోహదం చేశారు కనుక ఈ సంస్కరణ సభ నిర్వహించారా?

Advertisement

విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు..
వైఎస్‌ జగన్‌పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా అంటూ ఈయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక చంద్రబాబు నాయుడుకు రామోజీరావు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఈయన మరణంతో ప్రజల సొమ్ముతో ఇలా సంస్కరణ సభలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్

Published

on

Pawan Kalyan: రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి ఎంతో మంచి విజయం సాధించిన ఈయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రామోజీరావు సంస్కరణ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతర రాజకీయ నాయకులు పలువురు సినీ ప్రముఖులతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రామోజీరావుని కలిసినప్పుడు నాకు ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు.. ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ వెల్లడించారు. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.

Advertisement

రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి..
ఇలా నిలబడటానికి కూడా చాలా ధైర్యం కావాలని పవన్ తెలిపారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఈ శుభవార్తను ఆయన విన్నారా లేదా అనే విషయాన్ని నేను కనుక్కున్నాను అయితే కూటమి అధికారంలోకి వచ్చిందనే విషయం ఆయన విన్న తర్వాతనే మరణించారు అంటూ పవన్ తెలిపారు. ఇలాంటి ఓ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!