బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. గత ఎపిసోడ్లో ఇంటరాగేషన్ పేరిట ఏసిపి దీప ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మోనిత రోషిణిని కలుస్తుంది. ఈ క్రమంలోనే రోషిణిని తప్పు చేశానన్న ఫీలింగ్ కార్తీక్ లో అస్సలు కనిపించడం లేదు. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది.అయినా నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది కనుక తప్పకుండా న్యాయం చేస్తానని రోషిణిని చెబుతుంది. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్లకు శిక్షపడేలా చేస్తాను ఈ విషయం నాకు వదిలిపెట్టు అని చెప్పగా మోనిత మనసులో ఈమె నాకన్నా తేడాగా ఉంది. నాకు సహాయం చేస్తుందా లేదా వారికి చేస్తుందా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అదే సమయానికి కార్తీక్ తన తండ్రి తిరిగి వస్తున్నాడు అని ఆలోచిస్తూ బాధగా కూర్చుంటాడు. అప్పుడు దీపా భోజనం చేద్దురు రండీ అంటుంది. కార్తీక్ బాధగా.. తండ్రి వస్తున్నాడు ఈ విషయాలన్నీతెలిస్తే బాధపడతాడు అంటుండగా దీప ఇక్కడ జరిగిన విషయాలు ఏవి మామయ్యకు చెప్పవద్దు. ఇక్కడ హాస్పిటల్ పెట్టడం వల్లే అందరం కలిసి ఇక్కడే ఉన్నామని చెప్పండి అంటుంది. రేపు పొద్దున్నే మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి… నాకు కొంచెం పని ఉంది అది చూసుకొని మామయ్య వచ్చేలోపు నేను అక్కడికి వస్తాను అంటుంది దీప. దీంతో కార్తీక్ రేపంతా ముఖ్యమైన పని ఏమిటి అని అడుగగా… వెళ్లొచ్చాక మీకే తెలుస్తుంది అని చెబుతుంది.
ఇక ఉదయాన్నే ఆదిత్య తన తండ్రిని తీసుకురావడానికి వెళ్తూ బాధగా కనిపించడంతో శ్రావ్య ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో వదిన ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాన్ని నాన్నకు చెప్పవద్దని అంది.. ఎందుకో అర్థం కావట్లేదని బాధపడతాడు. శ్రావ్య కూడా అదే ఆలోచిస్తూ అన్యాయం జరుగుతుంటే చెప్పొద్దనడం ఏంటి అంటూ అనుకుంటుంది. ఈ సమయంలోనే ఏసీపీ రోషిణీ ముందు ప్రియమణి గజగజా వణుకుతూ.. నిలబడుతుంది. ‘నాకు నిజం చెప్పని వారిని కొట్టడానికి ఇద్దరిని ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఈమధ్య వారికి పని లేక అన్ని పగలు కొడుతున్నారు. నేను వాళ్లకి మాటిచ్చాను. నువ్వు నాకు నిజం చెప్పలేదు అనిపిస్తే నేను వాళ్లకు నిన్ను ఇస్తాను అంటుంది రోషిణీ. అప్పుడు ప్రియమణి మీరు ఏం అడిగితే అది చెప్తాను అంటూ ఆమె కాళ్ళ పై పడుతుంది.
Advertisement
అప్పుడు రోషిణీ అయితే ఆ రూంలోకి వెళ్లి వెయిట్ చెయ్ ఎవరికి ఫోన్ చేయకు అని చెప్పి సీసీ కెమెరాలు ఉన్న రూమ్ లోకి పంపిస్తుంది. అయితే అక్కడ కెమెరాలు ఉన్న విషయం ప్రియమణికి తెలియక నిజం చెబితే ఆ అమ్మ చంపుతుంది. చెప్పకపోతే ఈ అమ్మ చంపుతుంది అని కంగారు పడుతూ అర్జెంట్గా మోనితమ్మకి ఫోన్ చేసి.. నన్ను ఈవిడ తీసుకొచ్చి పడేసిందని మోనితమ్మకి చెప్పి.. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కనుక్కుని ఇక్కడ చెబుతా… అయినా మోనిత మించిన కిలాడి ఎవరుంటారు ?అని ఫోన్ నొక్కుతూ లాఠీలు చూసి ఆగి పోతుంది. అయితే ఆ రూమ్ లో ప్రియమణి మాట్లాడే మాటలు అన్ని బయట రోషిణీ వింటుంది.
మరోవైపు ప్రియమణి ఎక్కడికివెళ్ళింది అనుకుంటూ మోనిత కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే భాగ్యం మెట్లెక్కుతూ రావడం చూసిన మోనిత ఏయ్ ఆగు అక్కడే.. పైకి వచ్చేస్తావేంటీ.. వెళ్లు’ అని మోనిత కసరడంతో భాగ్యం వెనక్కి వెళ్తుంది. అయితే ఈ సారీస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లతో వంటలక్క ఎంట్రీ ఇస్తూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ నీ తన్ని మోనిత కి షాక్ ఇస్తుంది. ఇలా ఎంట్రీ ఇచ్చిన దీప కంప్లైంట్ ఇచ్చావా? మా పరువు తీసేద్దాం అనుకుంటున్నావా? అని నిలదీయడంతో మోనిత పొగరుగా అవును పరువు తీసేస్తా’ అంటూ పొగరుగా మాట్లాడటంతో.. మన వంటలక్క మోనిత ముందే సోఫాలో కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూడటంతో మౌనిక షాక్ అవుతుంది.
ఇప్పుడు దీపం మాట్లాడుతూ ఈ కడుపు సంగతి, 25వ తారీకు పెళ్లి సంగతి పక్కన పెట్టు. నీకు దుర్గా గుర్తున్నాడా… అంజి కూడా గుర్తున్నాడా.. అనగానే మోనితలో కంగారు, భయం కనిపిస్తాయి. గతంలో వారు చేసిన పనులు అన్ని గుర్తుకు వస్తాయి. ఏసీపీ గారి ముందు వాళ్లిద్దరినీ హాజరుపరిచాక అప్పుడు మాట్లాడుకుందాం..’ అని దీప అనడంతో మోనిత ముఖంలో రంగులు మారిపోయి హిమను చంపడం కార్తీక్ కి యాక్సిడెంట్ చేయించిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. దీపా పైకి లేచి 25తారీఖుని రెడ్ స్కెచ్తో సర్కిల్ వేసి చూపిస్తూ.. ‘ఇదే.. ఇదే 25 తేదీ.. నీకు పెళ్లి కావాలా? జైలు కావాలా తేల్చుకో..’ అని దీప అనడంతో మోనిత తల తిరుగుతుంది. అక్కడే ఉన్న భాగ్యం మెల్లిగా పెళ్లా..జైలా?’ అని నెమ్మదిగా చెవిలో చెబుతున్నట్లుగా అడుగుతుంది.దీప నవ్వుతూ.. ‘మ్చీ.. పడిపోయేలా ఉంది..’ అంటుంది. మోనిత నిజంగానే కళ్లు తిరిగి పడేలా కనిపిస్తోంది. తరువాత ఏం జరుగుతుందో తరువాయి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.
YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.
మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.
పులివెందులకు సీఎం.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.
ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.
Advertisement
మార్గదర్శకు మెట్టు.. ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత కొద్ది రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జాతకాలు గురించి చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ చాలా మొండోడు ఎవరు చెప్పినా కూడా వినరు ఆయన కేవలం త్రివిక్రమ్ లాంటి వారు చెబితేనే వింటారు చివరికి తన అన్నయ్య చిరంజీవి చెప్పిన వినే వ్యక్తిత్వం తనది కాదని వేణు స్వామి తెలిపారు. ఇక నేను కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తాను కూడా సీఎం కావాలని నేరు కోరుకుంటాను కానీ ఆయన జాతకం చూస్తే అది జరగదని వేణు స్వామి తెలిపారు.
పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం దాదాపు ఆయన చేసిన పది సినిమాలకు నేనే ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈయనతో కలిసి గంటలు గంటలు మాట్లాడాను అయితే ఆయనంటే ఉండే ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష వేరని వేణు స్వామి తెలిపారు.
Advertisement
సినిమాలతోనే మంచి పేరు.. ఇక రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో అవగాహన ఏమాత్రం లేదు. కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఆయనకు రాజకీయాలు కలిసి రావు ఆయన సినిమాలకే అంకితం అవుతారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి ఆయన జాతకం గురించి చెబుతూ కామెంట్లు చేయడంతో అభిమానులు కాస్త కలవర పడుతున్నారు.