Connect with us

Featured

Lalitha jewellery kiran kumar : లలితా జ్యూయలర్స్ అసలు ఓనర్ నేను కాదు… కేజీఫ్ ని మించిన సామ్రాజ్యం : కిరణ్ కుమార్

Published

on

Lalitha jewellery kiran kumar : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. రోజు టీవీ లో చూసే యాడ్ లో ఎంతో నిజం ఉంది అది మనకు తెలుసు కానీ కిరణ్ కుమార్ చెప్పాక ఆలోచించడం మొదలయింది. సాధారణంగా నగల యాడ్ అనగానే ఒక హీరోయిన్ లేక, మోడల్ నగలను అలకరించుకుని వచ్చే యాడ్స్ ఇంచుమించు అన్ని బ్రాండ్ల నగల ప్రకటనలు అలానే ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తాడో అవి మా షో రూమ్ లో ప్రయత్నించండి అంటూ అందరిని తన వైపు చూసేలా అనుకున్నారు లలితా జువలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. నగలను మా షో రూమ్ లో కొనండి అని అందరిలా ఆయన చెప్పలేదు. కేవలం మా షో రూమ్ లో నగల ధరలను, నగలను చూసి ఫోటో తీసుకుని ఇతర షో రూమ్ నగలతో పోల్చి ఆ తరువాత ఎక్కడ తక్కువ ధరలు లభ్యమావుతాయో అక్కడ కొనుక్కోండి అంటూ చెప్పాడు. ఈ మాటే చాలామంది వియోగదారులను ఆకర్శించింది.

డబ్బు మనిషి విలువను నిర్ణయిస్తుంది…

కిరణ్ కుమార్ తన వ్యాపారాన్ని నిజాయితీగా చేయాలనుకున్నారు అందుకే ప్రస్తుతం ఆయన వ్యాపారం సౌత్ ఇండియా మొత్తం విస్తరించి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా మారింది. ఎంతో పేదరికం అనుభవించి 14 ఏళ్లకే వ్యాపారం మొదలు పెట్టి 19 ఏళ్ల సమయానికి వ్యాపారం లో వృద్ధిలోకి వచ్చారు. ఇక కిరణ్ గారు ఆయన తల్లి బంగారం గాజులను కరిగించి వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఒక కేజీఫ్ లాంటి కథే ఉన్నా కిరణ్ గారి తండ్రి కాలికి చెప్పులు కూడా లేని పేదరికంలో ఉండగా, ఇపుడు ఇన్ని కోట్లు సంపాదించినా తన తల్లి తండ్రి ఇపుడు ఆ విజయాన్ని చూడలేదని ఆ అసంతృప్తి ఉందంటూ చెప్పారు కిరణ్. అందుకే జీవితంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదమే మనకు మంచి విజయాలను అందిస్తుంది. ఇక నా రోజు ప్రారంభం నా పాత రోజులను గుర్తు చేసుకునే మొదలవుతుంది, ఆకలి బాధలు, డబ్బు లేని రోజులు మర్చిపోతే ఇపుడు సాధించిన విజయాన్ని నిలుపుకోలేము. ఒకప్పుడు మనిషికి విలువ ఇచ్చేవారు, ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే విలువ ఇస్తున్నారు.

Advertisement

ఎవరు ఏమనుకున్నా ఇది నిజం ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి విలువ, గౌరవం ఉంటాయి అంటూ కిరణ్ అభిప్రాయపడ్డారు. ఇక మిగతా వారికంటే నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉన్నాను కాబట్టి నా సామ్రాజ్యం విస్తరిస్తోంది. నిజానికి మాయమాటలు చెప్పి ఒక నగ పది వేలు ఎక్కువకు అమ్మొచ్చు కానీ, నేను వెయ్యి కి అమ్మినా కానీ నేను అదే ధరతో ఒక వెయ్యి అమ్ముతాను, వాళ్ళు అన్ని అమ్మలేరు అదే అక్కడ జరిగేది. అది కాక ఈరోజు మోసం చేసి అమ్మితే రేపు మళ్ళీ నా దగ్గర కొనడానికి రారు కదా అంటూ వ్యాపార సూత్రం చెప్పారు. 1999 లో మొదలైన కిరణ్ గారి వ్యాపారం చెన్నై లోని లలితా జువలరీ షాప్ కొనడంతో మొదలయింది. ఆ షాప్ పేరు ఆయన పెట్టింది కాదు వేరే వాళ్ళ షాప్ ను కొనుక్కొని బంగారం వ్యాపారం మొదలపెట్టారు కిరణ్. ఇక కిరణ్ గారి సొంతూరు నెల్లూరు. రాజస్థాన్ కి చెందిన వారైనా నెల్లూరు కి వచ్చి తన ముందు తరాల వాళ్ళు స్థిరపడ్డారు, ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!