Connect with us

Featured

Music Director Koti : నా డైట్ సీక్రెట్ ఇదే… రాజ్ చనిపోయినపుడు నా పరిస్థితి… నా భార్య నావల్ల చాలా కష్టపడింది….: మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Published

on

Music Director Koti : సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రి లాగానే సంగీతదర్శకుడిగా మారిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్ కోటి గారి సంగీతం గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కోటి మొదట రాజ్ తో కలిసి రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఆ తరువాత ఇద్దరు పలు కారణాలతో వీడిపోయి ఎవరికీ వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కూడా హిట్లర్, హలో బ్రదర్, బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి కోటి గారికి. చిరంజీవి కాంబినేషన్ లో దాదాపు 11 సినిమాలు చేసి హిట్లు కొట్టారు కోటి. ఇక కెరీర్ లో ఒడదుడుకులను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు కోటి.

రాజ్ చనిపోయినపుడు ఎలా అయిపోయానంటే….

మ్యూజిక్ డైరెక్టర్ కోటి అనగానే రాజ్ కోటి అనే గుర్తొస్తుంది. వీరిద్దరి ధ్వయం ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. వారిద్దరి స్నేహం గురించి కోటి మాట్లాడుతూ ఇద్దరు చక్రవర్తి గారి వద్ద పనిచేస్తున్న సమయంలోనే రాజ్ కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వస్తే ఇద్దరం కలిసి చేద్దామా అని పిలిచారట. అయితే మొదట చక్రవర్తి గారు వద్దని చెప్పిన స్నేహం కోసం కోటి గారు చేశారట. అలా రాజ్ కోటి గా మారి ఇద్దరు ఎన్నో సూపర్ హిట్స్ ఇవ్వగా పదేళ్ల తరువాత రాజ్ మళ్ళీ ఇద్దరం విడిపోయి ఎవరి మ్యూజిక్ వాళ్ళు చేసుకుందాం అని చెప్పి విడిపోయాడు. రమ్మన్నది వాడే విడిపోదామని చెప్పింది వాడే అంటూ కోటి చెప్పారు. ఇక రాజ్ గారు మరణించడానికి ఇరవై రోజుల ముందు కూడా ఇద్దరం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం అంటూ ఒక్కసారిగా మరణ వార్త వినగానే చేతులు కాళ్ళు ఆడలేదు అంటూ కోటి తెలిపారు. రాజ్ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోయాను ఎం చేయాలో ఎం ఆలోచించాలో కూడ తెలియలేదు. మేమిద్దరం విడిపోయి మ్యూజిక్ చేసుకున్న స్నేహితులుగా కలిసే ఉన్నాం.

Advertisement

నేను ఒక్కడినే మ్యూజిక్ చేసినపుడు కూడ రాజ్ ఉన్నాడు నాతో అనే చేసేవాడిని అంటూ కోటి రాజ్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను రాజ్ కలిసి పనిచేసినపుడు రికార్డింగ్ స్టూడియో తప్ప వేరే లోకం ఉండేది కాదు పని చేస్తూ సమయానికి తినకుండా బాగా లావుగా ఉండేవాళ్ళం. కానీ కాలం గడిచాక మైంటైన్ చేయాలనీ అర్థమైంది అందుకే ఆరోగ్యం విషయం లో జాగ్రత్తగా ఉంటాను అంటూ డైట్ కంటే ముఖ్యం ప్రశాంతంగా ఉండటం అలానే ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ఉండటం ఇవి రెండు నేర్చుకున్నాక నేను ఇలా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక భార్య గురించి మాట్లాడుతూ ఆమె లేకపోతే నేను నా కెరీర్ ఇలా ఉండదు. తాను నన్ను తన బిడ్డ లాగే చూసుకుంది. బాధ్యతలాన్ని తానే తీసుకుంది నన్ను, పిల్లల్ని తీసుకెళ్లి నట్లు షాపింగ్ తీసుకెళ్తుంది. నేను టెన్షన్ లో ఉన్న తానే నా మూడ్ మార్చేస్తుంది అంటూ నా వల్ల నా భార్య బాగా ఇబ్బంది పడింది అంటూ చెప్పారు కోటి.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!