Connect with us

Featured

Tammareddy Bharadwaj: రాముడి గెటప్ మార్చేయడం విచిత్రంగా ఉంది.. ఆది పురుష్ టీజర్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Published

on

Tammareddy Bharadwaj: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ సినిమా గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఏంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేశారు.

ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజర్ చూసి ఇందులో ప్రభాస్ గెటప్ చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేయడం మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే అద్భుతంగా ఉంటాయని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటాయని తెలిపారు.మరో 20 రోజులలో ఈ సినిమా నుంచి ఇంకొక టీజర్ విడుదల చేస్తామని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూసి సంతోష పడతారు అంటూ తెలియచేశారు .

Advertisement

ఇకపోతే ఈ టీజర్ పై ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆది పురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది పైగా 500కోట్ల బడ్జెట్ అంటే సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఊహించాను అయితే ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా లాగా ఉందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందించారు.

Tammareddy Bharadwaj: రావణుడు కూడా బ్రాహ్మణుడే..

ఇదివరకే చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా ఫోర్ డి అయిన యానిమేషన్ కి లైవ్ కి చాలా తేడా ఉంటుంది. రాముడిని దేవుడిలా భావించే ఈ దేశంలో రాముడి గెటప్ మార్చేయడం చాలా విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు ఆయనకు కూడా మన భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయి.20 రోజులలో మొత్తం మారుతుందని చిత్ర బృందం చెబుతున్నారు నిజంగానే ఆ మార్పులు చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు

Advertisement

Featured

Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?

Published

on

Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పత్రికా అధినేత రామోజీరావుకు సంస్కరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభను నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రామోజీరావుకు సంస్కరణ సభ ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్సిపి నేత హైకోర్టు న్యాయమూర్తి నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణ సభలు నిర్వహించలేదు కానీ పత్రికా రంగం అధినేత రామోజీరావుకు ఎందుకు ప్రభుత్వం తరఫున సంస్కరణ సభ నిర్వహించారని ప్రశ్నించారు. ఈయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ సభను నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ సంస్కరణ సభ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు ఎంతగానో దోహదం చేశారు కనుక ఈ సంస్కరణ సభ నిర్వహించారా?

Advertisement

విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు..
వైఎస్‌ జగన్‌పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా అంటూ ఈయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక చంద్రబాబు నాయుడుకు రామోజీరావు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఈయన మరణంతో ప్రజల సొమ్ముతో ఇలా సంస్కరణ సభలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్

Published

on

Pawan Kalyan: రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి ఎంతో మంచి విజయం సాధించిన ఈయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రామోజీరావు సంస్కరణ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతర రాజకీయ నాయకులు పలువురు సినీ ప్రముఖులతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రామోజీరావుని కలిసినప్పుడు నాకు ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు.. ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ వెల్లడించారు. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.

Advertisement

రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి..
ఇలా నిలబడటానికి కూడా చాలా ధైర్యం కావాలని పవన్ తెలిపారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఈ శుభవార్తను ఆయన విన్నారా లేదా అనే విషయాన్ని నేను కనుక్కున్నాను అయితే కూటమి అధికారంలోకి వచ్చిందనే విషయం ఆయన విన్న తర్వాతనే మరణించారు అంటూ పవన్ తెలిపారు. ఇలాంటి ఓ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!

Published

on

YS Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పోలవరం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తమ హయాంలోని 72% పోలవరం పనులు పూర్తి అయ్యాయని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులన్ని దారి మళ్ళించారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించారు.

గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం మల్లె పోలవరం పూర్తి కాలేకపోయిందని చెప్పారు నాణ్యత లేకుండా డయాఫ్రమ్ నిర్మించడంతో డ్యాం పూర్తిగా డామేజ్ ఆయన నేపథ్యంలోనే పోలవరం పూర్తి కాలేకపోయిందని తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల పోలవరం పై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా పోలవరం విషయంలో నువ్వా నేనా అంటూ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బిజెపి నేత అలపాటి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

ప్రజలను మోసం చేయలేను..
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన నిర్మాణ పనులలో డ్యామేజ్ కారణంగా వాటిని కప్పి పుచ్చి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే అది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదకరమని ఈ విషయంలో ప్రజలను మోసం చేయలేనని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!