బుల్లితెరపై రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1098 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా దీప, కార్తీక్, మోనిత మధ్య ఎంతో రసవత్తరంగా ఈ సీరియల్ కొనసాగింది. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే.. అర్ధరాత్రి కార్తీక్ కోసం దీప ఇంటికి వెళ్లిన మోనిత దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అయితే అది చూసిన దీప ఇక్కడ ఎవరు పడుకొని ఉంటారు. అంటూ డాక్టర్ బాబు అనుకుని డాక్టర్ బాబు అంటూ.. నిద్ర లేపుతుంది. ఎంతసేపటికి లేవకపోతే దుప్పటి తీసి చూడగానే మోనిత కనిపించేసరికి దీప షాక్ అవుతుంది. దీపను చూసి ఏంటి కంగారు పడ్డావా..మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ పడుకున్నాను అంటూ చెప్పడంతో దీప మోనిత బయటకు లాక్కొని వస్తుంది.
ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో బయట హాస్పిటల్ లో పడుకున్న కార్తీక్ లేచి అక్కడికి వెళ్లడంతో కార్తీక్ ను చూసిన మోనిత ఇక్కడ పడుకున్నావా.. ఇంతవరకు బెడ్రూంలో పడుకున్నావని, నేను హాల్ లో పడుకొని టైం వేస్ట్ చేశాను అని చెబుతుంది. అదేవిధంగా నా ఒంటరితనం నీ ఏకాంతాన్ని కోరుకుంటుంది.. నువ్వు రమ్మంటే రావు నేను వస్తానంటే వద్దంటావా అనగా అసలు ఏం చేస్తున్నావో తెలుసా..? అడ్డు కార్తీక్ కోపంతో అరుస్తాడు. ఈ విధంగా మోనిత మాట్లాడే మాటలకు కార్తీక్ కు ఎంతో కోపాన్ని తెప్పిస్తాయి.ఈ క్రమంలోనే ఇదివరకు నీ పై ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించగా ఇందులో తప్పేముంది.. నేను నీకు ఆడదానిగా కనిపించలేదా అంటూ మోనిత అనగా.. నాకు ఆడదాని లాగా కనిపించింది ఈ పాటికి ఎప్పుడో తల్లివి అయ్యే దానివి అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు.
ఈ క్రమంలోనే దీపతో పోల్చడం కోపంతో కార్తీక్ దీపతో పోల్చుకోకు దీప దేవుడు ముందు వెలిగే దీపం.. నువ్వువీధి దీపం లో నిలబడ్డామని కార్తీక్ అనడంతో వీధిలోకి నిలబెట్టింది నువ్వే కదా.. అంటూ మోనిత సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే దీపతో మోనిత మాట్లాడుతూ.. నేనే కనుక నీ చెల్లి అయి ఉంటే.. నీ భర్త అదే నా బావ తొందరపడి నన్ను లొంగదీసుకొని ఉంటే ఇలాగే చేసేదానివా.. గుట్టుచప్పుడు కాకుండా నా బాబుకు నన్ను ఇచ్చి పెళ్ళి చేసే దానివి కదా దీపక్క అనడంతో కార్తీక్ కోపంతో స్టాప్ ఇట్ మోనిత ఇప్పటికి నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇలా అర్థరాత్రి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావ్ అంటూ ఆమె పై విరుచుకు పడతాడు.
Advertisement
ఈ సందర్భంలో దీప కలగజేసుకుని డాక్టర్ బాబు లోపలికి వెళ్లి పిల్లల దగ్గర పడుకోమని చెబుతుంది. ఆతరువాత దీప మోనితతో ఇంత బరితెగించి.. విచ్చలవిడిగా అర్ధరాత్రి నా భర్త కోసం.. నా ఇంటికి వచ్చి ఇంత చండాలంగా.. నీతిమాలిన… పెళ్లి కాకుండానే నెలతప్పిననువ్వు ఇంత మాట్లాడుతున్న నేనే ఏమి చేయకపోవడానికి కారణం ఇంట్లో పిల్లలు ఉన్నారని ఉద్దేశంతో మాత్రమే. నీ చరిత్ర ఇంట్లో ఉన్న పిల్లలకు తెలిస్తే బాగుండదు అన్న కారణంతో మాత్రమే.. లేకపోతే అక్క.. అన్నందుకు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేదాన్ని.. అంటూ దీప చెడామడా తిట్టి పోస్తోంది. జరగదు.. నా భర్తతో నీ పెళ్లి అస్సలు జరగదు అంటూ మోనిత బెదిరిస్తుంది. భయంతో అక్కడినుంచి ఇంటికి వెళ్ళిన మౌనిత నిజంగానే దీప అన్నంత పని చేస్తుందా… ఏంటి దాని కాన్ఫిడెన్స్ అంటూ భయపడి పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.
Barelakka: బర్రెలక్క పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా గత ఎన్నికలలో భాగంగా తెలంగాణ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరింత పాపులర్ అయ్యారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీకి దిగారు.
ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైనటువంటి ఈమె వెంకటేష్ అనే వ్యక్తిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త సహాయంతో ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అయితే ఇటీవల బర్రెలక్కపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో నెగటివ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి.
ఈ విధంగా ఈమె గురించి నెగిటివ్ కామెంట్లు రావడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడ్డారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో నా గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తుంటే నేను మరో గీతాంజలి అవుతానేమోనని భయం వేస్తుందని తెలిపారు. ఆ ట్రోల్స్ చూసిన కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారని తెలిపారు.
Advertisement
దయచేసి ట్రోల్ చేయొద్దు.. మీకు నాపై కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి కానీ దయచేసి ఎవరూ కూడా ఇలాంటి కామెంట్లు చేయొద్దని ఈమె తెలిపారు. ఆ కామెంట్లు చూసి నేను కూడా ఎక్కడ చనిపోతానేమోనని బాధ భయం నాలో కలుగుతున్నాయని తెలిపారు. ఇక నేను ఎంపీ ఎన్నికలలో పోటీ చేయడమే తప్పు అయితే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను పూర్తిగా సోషల్ మీడియాకి అలాగే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ట్రోల్స్ కారణంగా ఈమె ఇబ్బంది పడుతున్నానంటూ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
YS Vijayamma: ఏపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా కూటమి నేతలు ఎన్నో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక చివరికి తన కన్నతల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపలేదంటూ ప్రచారాలు చేశారు కానీ వైయస్ విజయమ్మకు తన కూతురు షర్మిల కంటే కొడుకు జగన్ అంటేనే ఇష్టమని తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.
ఇటీవల వైఎస్ షర్మిలని గెలిపించాలి అంటూ ఈమె ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియోలో భాగంగా జగన్ పై తనకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు. వైయస్సార్ ముద్దుల బిడ్డ వైయస్ షర్మిలమ్మ కడప పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఈమె అందరిని వేడుకున్నారు.
ఇక ఈ వీడియోలో భాగంగా వైయస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఎక్కడా కూడా ఈమె కాంగ్రెస్ పేరు పలకలేదు అలా పలకడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా షర్మిలను గెలిపించాలని చెప్పారే తప్ప వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎక్కడా కోరలేదు.
Advertisement
కాంగ్రెస్ పేరు కూడా పలకలేదు… ఇక ఈ వీడియోలో భాగంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎక్కడ పలకలేదు. దీన్ని బట్టి చూస్తేనే ఈమె తన కొడుకుకు మద్దతు తెలుపుతున్నారని, తన కొడుకు అంటేనే విజయమ్మకు ప్రేమ ఉందని తెలుస్తుంది అలాకాకుండా పూర్తిగా తన కూతురికే మద్దతు తెలిపేలాగా ఉంటే ఈమె తన కొడుకు పై విమర్శలు చేసేది కానీ ఎక్కడ కూడా జగన్ పేరును కూడా విజయమ్మ ప్రస్తావించకపోవడం తన కొడుకు పై తనకు ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమని చెప్పాలి.
Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా నేడు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ఓటు వినియోగించుకున్నటువంటి చిరంజీవి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతకు మంచి సందేశం అందజేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాయుద్ధం అయినటువంటి ఓటును యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో కూడా సరైన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.
Advertisement
ఓటు మన బాధ్యత.. ఇక చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితోపాటు ఎన్టీఆర్ అల్లు అర్జున్ శ్రీకాంత్ దంపతులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.