Connect with us

Featured

ఎవరు ఈ తాలిబన్లు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

Published

on

ఇప్పుడు ఎక్కడైనా నలుగురు కలిసి మాడ్లాడుకునే మాట తాలిబన్లు. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న ఈ తాలిబన్లు ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకుందాం..

తాలిబన్ అంటే “విద్యార్థులు” అని అర్థం. వ్యవస్థాపక సభ్యుడు ముల్లా మహ్మద్ ఒమర్ విద్యార్థులు. 1994 సంవత్సరంలో ముల్లా మొహమ్మద్ ఒమర్ అంతర్యుద్ధం సమయంలో అవినీతిని సవాలు చేయడానికి డజన్ల కొద్దీ అనుచరులతో తాలిబన్‌ను స్థాపించారు. ఈ బృందం వాస్తవానికి “ముజాహిదీన్” అని పిలవబడే యోధుల నుండి సభ్యులను ఆకర్షించింది. వారు 1980 లలో ఆఫ్ఘనిస్తాన్ నుండి గతంలో USSR(ఇప్పుడు రష్యా) దళం నుంచి బయటకు వచ్చిన వారు. ఇది 1996 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధించింది. 2001 లో సంవత్సరంలో వాళ్ల అరాచకాలకు అమెరికా స్పందించింది. తాలిబన్ల గ్రూపు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా సైనిక బలగాలు చెదరగొట్టాయి.

తర్వాత ముల్లా మహ్మద్ ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు. మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్ల ఆటవిక పాలన సాగించారు.

Advertisement

అగ్రరాజ్యం అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001లో అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది అమెరికా. అయితే ఇటీవల యూఎస్ బలగాల ఉపసంహరణతో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారని వార్తలతో ప్రజల కళ్ళముందు తాలిబన్ల క్రూర పాలన కనిపిస్తోంది. ఇంతకాలం టీషర్ట్ లు , జీన్స్ వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తులను ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎయిర్ పోర్టులోకి ప్రజులు గుంపుగుంపులుగా వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజలలో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనలకు అద్దంపడుతున్నాయి. ఆఫ్ఘన్ లో ప్రాణ భయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్ పోర్టుకు క్యూకడుతున్నారు. ఇలాంటి రాక్షస పాలను సాగిస్తున్న వారి చెర నుంచి తమను రక్షించాలని వాళ్లు వేడుకుంటున్నారు.

Advertisement

Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆగని అవార్డులు.. ఫిలింఫేర్ అవార్డులలో సత్తా?

Published

on

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.

Advertisement

ఏడు విభాగాలలో అవార్డులు..
వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ananth Ambani: వామ్మో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.

ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

5000 కోట్లు..
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
Continue Reading

Featured

Lavanya: పవన్ మూడు పెళ్లిళ్ల పై లావణ్య షాకింగ్ కామెంట్స్.. ఆయన వద్దే తేల్చుకుంటా అంటూ?

Published

on

Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!