Featured
Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?
Published
2 years agoon
By
lakshanaAgneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.
ఈ పథకంలో భాగంగా 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్సున్న యువకుల ను ఈ పథకం ద్వారా సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంచుతారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్ లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయానని,దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఏదైనా ఒక పథకం గురించి అధికారపక్షం నిర్ణయం తీసుకుని ఆ పథకం గురించి ప్రతిపక్షం మరుక్షణమే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడం సర్వసాధారణం అయింది.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత దేశ సైనిక దళాలను పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే మనకు ఎంత సైన్యం ఉన్నారు అనేది ముఖ్యం కాదు ఆ సైన్యం ఎంత సమర్థవంతంగా ఉన్నారనేది ముఖ్యం అని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా అధిక మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వారికి అధిక స్థాయిలో జీతభత్యాలు చెల్లిస్తూ సరైన శిక్షణ లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కోసమే ఉద్యోగ ప్రకటనలు…
అమెరికా వంటి దేశాలలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి దగ్గర అధునాతనమైన సాంకేతిక శక్తిని కలిగి ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం వల్ల దేశ భద్రత మరింత పటిష్టంగా ఉంది. మనదేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తూ వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఏ స్థాయిలో ఉద్యోగుల అవసరం అనే విషయం గుర్తించలేదు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి ధోరణిని ఎంపిక చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒక పై అధికారికి డ్రైవర్ బంట్రోతు అందరూ ఉన్నారు అధికారికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేశ ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరని తెలిపారు.
మన దేశంలో సరైన విద్య, సరైన ఆరోగ్యం లేదు. కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రత కూడా లేదు.వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం వచ్చే ఎన్నికలపై దృష్టి పెడుతూ ప్రధాన మంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు ఎంతమేర సైన్యం అవసరం అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకేసారి లక్షలు ఉద్యోగ ప్రకటన ఇస్తే వారికి తదుపరి ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటుందనేది వారి ఉద్దేశమని ఈయన ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.
You may like
Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి అరుదైన గౌరవాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Nagarjuna: చిరంజీవి మీద కోపంతోనే ఏఎన్నార్.. నాగార్జునను హీరో చేసారా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గీతాకృష్ణ !
Alia Bhatt: కరణ్ షోలో ఫస్ట్ నైట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన అలియా.. అలసిపోయి ఉంటామంటూ కామెంట్స్?
Anshula Kapoor: ఇదెక్కడి దారుణం.. కెమెరా ముందే బ్రా తీసేసిన స్టార్ హీరో సోదరి.. రిలీఫ్ గా ఉందంటూ కామెంట్స్?
Upasana: పనిలేని వాళ్లే పిల్లల్ని కంటారు.. సద్గురు మాటలకు షాక్ అయిన ఉపాసన?
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై భారీ ట్రోల్స్..ఇదేం క్రియేటివిటీ రా బాబు!
Featured
ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ
Published
56 mins agoon
27 July 2024ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.
గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్వర్డ్లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.
Featured
Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!
Published
17 hours agoon
26 July 2024By
lakshanaNiharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?
Published
17 hours agoon
26 July 2024By
lakshanaAnasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ
Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!
Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?
Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?
Sai Sreenivas: మంచి మనసు చాటుకున్న బెల్లంకొండ హీరో… గ్రేట్ అంటున్న నేటిజన్స్?
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
Trending
- Featured4 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Featured4 weeks ago
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
- Featured4 weeks ago
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
- Featured2 weeks ago
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
- Featured2 weeks ago
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
- Featured3 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!
- Featured4 weeks ago
Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!