Connect with us

Featured

ప్రజల ఇళ్లు, స్కూల్, హాస్పిటల్ అన్నీ ఒకే భవనంలో.. ఎక్కడంటే?

Published

on

సాధారణంగా ఒక గ్రామం అంటే చిన్న చిన్న ఇల్లు , స్కూలు, హాస్పిటల్స్ అంటూ ఎన్నో ఉంటాయి.ఈ విధంగా ఒక గ్రామం అంటే ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో అన్ని ఇల్లు మనకు కనిపిస్తాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం అలాంటివి ఏవీ కనిపించవు. గ్రామం మొత్తం ఒకే బిల్డింగ్ లో నివసిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలన్నీ అదే బిల్డింగ్ లో ఉంటాయి. ఇంతకీ ఆ గ్రామం ఏమిటని ఆలోచిస్తున్నారా..ఆ గ్రామం అమెరికాలోని అలస్కాలో ఉంది.

విట్టీర్‌లో గల ఈ అపార్ట్‌మెంట్ సిటీని “బిగిచ్ టవర్స్”అని పిలుస్తారు. ఈ అపార్ట్మెంట్ సముద్ర తీరంలో 14 అంతస్థుల ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ సుమారు నూట తొంభై ఆరు కుటుంబాలు నివసిస్తాయి. ఈ అపార్ట్ మెంట్ లోనే వారికి కావాల్సిన హాస్పిటల్, స్కూల్, నిత్యావసర సరుకులు, పోస్ట్ ఆఫీస్ వంటి తదితర సౌకర్యాలు అన్ని ఉన్నాయి. అందుకే ఈ బిల్లింగ్
ను ‘టౌన్ అండర్ వన్ రూఫ్’ అని అంటారు. వాస్తవానికి ఈ పట్టణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడింది. మిలట్రీ హార్బర్ నిర్మాణం కోసం అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

ఈ 14 అంతస్తుల భవనంలో మూడు విభాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఆ గ్రామ ప్రజలు నివసిస్తే, మిగతా భాగంలో విభాగాల్లో పోస్టాఫీస్, హాస్పిటల్, స్కూల్, జనరల్ స్టోర్, పోలీస్ స్టేషన్, మేయర్ ఆఫీస్ ఉన్నాయి. ఇందులో చిన్న హోటల్, కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంది. భవనాన్ని అనుకొని ప్లే ఏరియా ఇండోర్ పూల్ కూడా ఉంది.

Advertisement

ఈ భవనం పర్వతాలు అనుకునే ఉండడంతో ఇక్కడ వన్యప్రాణుల భయం ఎక్కువగా ఉండటం చేత ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒకే భవనంలో ఉండటం వల్ల వారికి ఎంతో భద్రత ఉందని భావిస్తారు. అమెరికాకు చాలా దూరంగా ఉండటంతో వీరికి కావలసిన కూరగాయలను వీరే స్వయంగా పండించుకుంటారు. వీటి బాధ్యతను అక్కడ ఉన్న పిల్లలు తీసుకుంటారు. పిల్లల క్రీడా మైదానాలు కూడా ఇండోర్ లోనే ఉన్నాయి. ఈ భవనాన్ని చేరుకోవాలంటే ప్రత్యేక కారిడార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా గ్రామ మొత్తం ఒకే భవనంలో నివసించడం ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!