Connect with us

Featured

Babu Antony : పసివాడి ప్రాణం సినిమాలో ఒకప్పటి విలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Published

on

Babu Antony : తెలుగు ఇండస్ట్రీలో ఎందరో నటులు, మహానటులు ఉన్నారు. హీరోలుగా చాలామంది మంచి గుర్తింపును లభించుకొన్నప్పటికీ వారికి సమానంగా నటించి విలనిజంలో కొత్త అర్థాన్ని చూపించిన కొంతమంది విలన్స్ చూస్తేనే భయం వేస్తుంది మనకు. అంత క్రూరత్వాన్ని వెండితెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, పసివాడి ప్రాణం సినిమా విలన్ గా నటించిన బాబు అంటోనీ. ఈయన చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఇతను నటించిన పసివాడి ప్రాణం సినిమాలో విలన్ అని చెప్పగానే అబ్బో ఈ విలన్ అని వెంటనే గుర్తుపడతారు తెలుగు వాళ్ళు.

ఇక హీరోలతో సమానంగా ఫైట్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటోనీ అతని సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కేవలం యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా ఈయన జేబుదొంగ, శత్రువు, మిత్రుడు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, కాంచన వంటి సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఇంకా తినేత్రుడు, పసివాడి ప్రాణం సినిమాలో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెగాస్టార్ చిరుతో పోటాపోటీగా ఫైట్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన.

బాబు అంటోనీ వ్యక్తిగత విషయానికి వస్తే… తను సినిమాల్లో మాత్రమే కాదు తన నిజజీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీ ఈయన. ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఆదరణ తెచ్చుకున్నాడు బాబు అంటోనీ. అప్పటిలో మంచి స్టార్ డం హీరోగా ఎదిగాడు. ఇక ఇతను పూణేలో ఇంగ్లీష్ లిటిరేచర్ గా డిగ్రీ పూర్తి చేశాడు. మొదటిగా విలన్ పాత్రలు శిరంబు అనే సినిమాతో బాబు ఆంటోనీ మళియాల సినిమారంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటిలో అగ్ర హీరోలు కూడా ఇతరులతో ఫైట్లు చేయాలంటే చాలా కష్టపడేవారు. ఆంటోనీ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. దాదాపు 160 సినిమాలలో ఈయన నటించారు.

సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే ఒక రష్యన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విలన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే విలన్ గత కొన్ని రోజులుగా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనబడలేదు. కానీ తమిళ్, మలయాళం సినిమాలో మాత్రం నటిస్తూ ఉన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించాడు. అంతేకాదు త్వరలో మణిరత్నం తీయబోతున్న పోన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా నటించబోతున్నాడు. ఇక ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!