1980 దశకంలో ఎంతో మంది కథానాయకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సుమన్, రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, సురేష్, శ్రీకాంత్ లాంటి ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలా 1988లో అత్తగారు స్వాగతం అంటూ ఎన్టీ రామారావు సోదరుని కుమారుడు త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి వెండితెరకు పరిచయమయ్యారు.
అయితే రామారావు సోదరుడైన N.త్రివిక్రమరావు కో ప్రొడ్యూసర్ గా శ్రీకృష్ణసత్య, వరకట్నం, ఉమ్మడి కుటుంబం సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, జై సింహ, తోడుదొంగలు, పిచ్చి పుల్లయ్య లాంటి చిత్రాలను నిర్మించారు. 1988 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుమతి రామకృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన అత్తగారు స్వాగతం చిత్రంలో అశ్విని తో జత కడుతూ హీరో కళ్యాణ్ చక్రవర్తి వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత హీరోయిన్ కల్పనతో మామ కోడళ్ళ సవాల్ లో చిందేశారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి హీరోయిన్ ఊర్వశి తో ఇంటి దొంగ అ చిత్రంలో నటించారు. ఖుష్బు హీరోయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి ప్రేమ కిరీటం సినిమాల్లో కనిపించారు.
హీరోయిన్ అశ్వినితో రౌడీ బాబాయ్ అలాగే హీరోయిన్ రజిని తో మేనమామ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం లో మెగాస్టార్ చిరంజీవికి కి చెల్లెలి భర్తగా అంటే చిరంజీవికి బావ గా కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఆ తర్వాత 1994 వచ్చేసరికి తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాదుకు షిఫ్ట్ కావడం మూలంగా అప్పుడే తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ గందరగోళంలో మద్రాసులోనే ఉండిపోయారు. తర్వాత తనకు సినిమాలకంటే తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని ఆయనకు సేవలు చేస్తూ మద్రాసులోనే ఉండిపోయారు. తర్వాత కొన్ని రోజులకు తండ్రి మరణించడంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి పోయారు.
అలా ఆయన సినిమాల్లో నటించలేక పోయారు. తర్వాత ఆయన తన వారసత్వంగా సినిమాల్లోకి తన పిల్లలు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. విజయవాడ గాంధీ నగర్ లో కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఏకంగా ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ను ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చారు. అయితే కళ్యాణ్ చక్రవర్తి నందమూరి బాలకృష్ణ కు బాబాయ్ కొడుకు అనగా గా బాలకృష్ణకు కు సోదరుడిగా చెప్పుకోవచ్చు.
Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
బెంజ్ కారు.. ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.
ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో లాకింట బంకేట్ హాల్లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్లో జరగనుందని తెలుస్తోంది. తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్.. ఆడిషన్స్ నిర్వహించింది.
Advertisement
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.
ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
Advertisement
మన వయసు పెరగదు.. ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.