Connect with us

Featured

మునగ చెట్టు వలన ఏన్ని ఉపయోగాలో తెలుసుకోండి.. !!

Published

on

ఈ కాలంలో చాలామంది ఎక్కువగా ఎటువంటి చిన్న అనారోగ్యం అయినాగాని వెంటనే మందులు వేసేసుకుంటున్నారు. కానీ ఇలా ప్రతి చిన్న రోగానికి మందులు వేసుకుంటే భవిష్యత్తులో లేని పోనీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి మందులు వేసుకోకపోతే రోగం ఎలా నయమవుతుంది అన్నా ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది..అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎలాంటి అనారోగ్యానికైనా మన చుట్టు పక్కల ఉండే మొక్కలు,పువ్వులు, ఆకులు, వృక్షాల్లో ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది అని. అవునండి మీరు విన్నది నిజమే.. !! మన ఇంట్లో పెరటిలో పెంచే కొన్ని మొక్కల వలన మనకు కొన్ని అనారోగ్యాలు నయం అవుతాయి. అలాంటి కోవలోకి చెందిన చెట్లలో ఒకటే మునగ చెట్టు ఒకటి.

మన పూర్వకాలంలో మన పెద్దలు మనలా ప్రతిదానికి ఆసుపత్రికి వెళ్లి మందులు మింగారు. వాళ్ళు ముందుగా ప్రకృతి చికిత్సకు ప్రాధాన్యత ఇస్తారు. ములగ ఆకుల్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు మనకు కలిగే స్వల్ప అనారోగ్యాలను మాత్రమే కాదు, పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులను కూడా నయం చేయగలుగుతాయి. అసలు మునగాకు వల్ల మనకు ఎలాంటి ఉపయోగంలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మూలగ ఆకుని అన్ని పోషకాలు ఉన్న పోషకాల గని అనడంలో తప్పులేదు. ఎందుకంటే మునగ చెట్టు ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వ్యాధినిరోధకతను పెంచుతుంది.

దీంతోపాటు విటమిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ బి2, ఐరన్‌, మెగ్నిషియం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు మునగ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నిత్యం మునగ ఆకును మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మునగ చెట్టు ఆకులను నిత్యం కూర, లేదా రసం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్నట్టయితే దాంతో కండరాలు బలంగా మారతాయి. ఈ ఆకులను తినడం వలన శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. దీంతో ఎముకలకు బలం చేకూరుతుంది.
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కూడా దూరమవుతాయి.విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు నాశనమవుతాయి. కొంతమంది అప్పుడప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున అలాంటి వాళ్లు మునగ చెట్టు వేళ్లను తీసుకుని బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది.ఈ కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎదురుకునే ప్రధాన సమస్య షుగర్ వ్యాధి. మునగాకులు షుగర్ వ్యాధి నుండి రక్షణ కలిపిస్తాయి. ఎలాగంటే మునగ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.. చూసారు కదా మూలగాకు ఉపయోగాలు ఇంక ఆలస్యం చేయకుండా ములగ చెట్టు ఎక్కడ ఉందో వెతకండి మారి.. !!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!