Connect with us

Featured

రచన నలభై సినిమాలకి పైగా ఒకే హీరోతో కలిసి నటించింది.. ఆయన ఎవరో తెలుసా..?

Published

on

రచన బెనర్జీగా పాపులర్ అయిన హీరోయిన్ తెలుగులో రచనగా అందరీ సుపరిచితురాలు. ఆమె చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుందని మన టాలీవుడ్ అగ్ర దర్శకులు  ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేశారు. రచనా బెనర్జీ బెంగాళీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అక్కడ క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది. రచన టాలీవుడ్‌కి రాక ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఆ భాషలలో సినిమాలు బాగా హిట్ అవుతుండటంతో దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ కంట్లో ఈమె పడింది.

ఆమె నటించిన సినిమాలు చూసిన ఇ.వి.వి.సత్యనారాయణ ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘నేను ప్రేమిస్తున్నాను’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. జె.డి.చక్రవర్తి హీరోగా నటించిన ‘నేను ప్రేమిస్తున్నాను’ 1997లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. అటు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటిస్తూనే తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా చేసింది.

మొదటి సినిమా తర్వాత 1998 లో, ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలోనే కన్యాదానం అనే సినిమా చేసి భారీ హిట్ అందుకుంది. అంతేకాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా సినిమాలో నటించి వరుస హిట్స్ అందుకుంది. ఇదే ఏడాది జగపతి బాబు – ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్‌లో వచ్చిన ‘మావిడాకులు’ సినిమాలో నటించింది. అంతేకాదు మంచు మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాలో కూడా నటించి హిట్ అందుకుంది. చెప్పాలంటే రచన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంవత్సరమే ఎక్కువ సినిమాలలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయింది.

ఇక ఎస్.వి.కృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో నటించిన ‘అభిషేకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే సంవత్సరం ‘ఈశ్వర్ అల్లా’ అనే మరో సినిమా చేసింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న రచనకి శరత్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిది. అయిన ఈ సినిమా ప్రభావం రచనపై ఏమాత్రం పడలేదు. ఇక 2002లో వైవిఎస్ చౌదరీ దర్శకత్వంలో వచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు.

అందుకు కారణం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ బిజీగా మారడమే. ఇక్కడ సినిమాలు చేస్తున్న రచన ఒరియా, బెంగాళీ భాషలలో క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించిన రచన ఎక్కడ సినిమా చేసిన నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇ.వి.వి.సత్యనారాయణ హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో తీసిన ‘సూర్యవంశ్’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే ఈమె రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించిన సినిమాలుండటం విశేషం.

ఇలానే వీరు ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే విడాకులు తీసుకున్నారు. అంతేకాదు అక్కడ అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించలేక ఏకంగా ఒరియా ఇండస్ట్రీనే వదిలేసింది. ఆ తర్వాత 2005లో ప్రొబల్ ని రెండవ పెళ్ళి చేసుకుంది.

వీరికి ప్రొణీల్ అనే కొడుకు ఉన్నాడు. కాగా ఒరియా ఇండస్ట్రీ వదిలేసిన రచన బెంగాళీలో ప్రొసేన్‌జీత్ ఛటర్జీతో చాలా సినిమాలు చేసింది. వాటిలో దాదాపు అన్నీ సినిమాలు హిట్ సాధించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తే నటించేందుకు సిద్దంగా ఉందట.  

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!