Connect with us

Featured

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

Published

on

ప్రతి అక్షరానికి సరైన అర్ధం చెప్పగల నేర్పరి అతను. అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.  ఆ అక్షరాల ఆత్మీయతను అంతరంగగా ఆస్వాదిస్తారు..వాటితో అనంతమైన విన్యాసాలు చేస్తారు. అక్షరాలతో గారడీ చేసి వాటిని ఓ గమ్యానికి చేర్చి ప్రతి ఒక్కరు హక్కున చేర్చుకునే విధంగా చేయడం ఆయన స్పెషాలిటే. ఆయనే లిరిసిస్ట్ చంద్రబోస్. తెలుగు ఇండస్ట్రీకి లభించిన అద్భుతం ఈయన. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. నవ్వు, ఏడుపు, బాధ, విశ్వాసం, సందేశాత్మకం ఇలా ఏ భావాన్నైనా తన కలం నైపుణ్యంతో స్వరాలను పేర్చగల నేర్పరి చంద్రబోస్‌. 

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

కొన్ని పాటలు ప్రేక్షకుల పెదాలపై కదలాడుతుంటే, కొన్ని పాటలు విమర్శకులకు సైతం సవాళ్లను విసురుతుంటాయి. ఇండస్ట్రీలో ప్రారంభంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నా తాను నమ్ముకున్న కలమే తనని శిఖర స్థాయిలో నిలబెట్టాయి. కొన్ని పాటలు ప్రేమ భావాన్ని తెలిపేవి అయితే మరికొన్ని పాటలు ప్రతి ఒక్కరి చేత కంట కన్నీరు తెప్పిస్తాయి. ఒకానొకసారి తాను రాసిన పాటలే తనకు కన్నీళ్లు పెట్టించాయని చంద్రబోస్ చాలా సార్లు తెలిపారు.

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

రచయిత ఆవేశాన్ని ఆపడం ఎవరి వల్లా కాదంటూ తన పాటల ద్వారా ఎన్నో సార్లు నిరూపించారు. తాజ్‌మహల్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు చంద్రబోస్‌. ఈ చిత్రంలో మంచు కొండల్లోని చంద్రమా చల్లగాలి చల్లిపో అన్న పాట రాసింది చంద్రబోసే. ఆ పాటను అప్పట్లో ప్రేక్షకులు ఆదరించారు. ఆ తరువాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలోనూ పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ హిట్ కావడంతో చంద్రబోస్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. అలా తాజ్ మహల్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో సుమారు 800 సినిమాల్లో 3300లకు పైగా పాటలు రాశారు.

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాటలు రాశారు చంద్రబోస్‌. ఆ పాటలన్నీ మంచి ప్రేక్షకాధరణ పొందాయి. చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంలో ఓ మారియ ఓమారియా సాంగ్ ను రాశారు చంద్రబోస్. ఇది మంచి ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఠాగూర్‌ సినిమాకు రాసిన కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి పాట యూత్‌లో మంచి వేడిని రగిలించింది. అప్పట్లో ఈ పాట అందరి నోట వినిపించింది. ఇక డాడీ చిత్రంలో లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ పాటకు మంచి ప్రేక్షాకాధరణ లభించింది. చిరు సినిమాలకే కాదు ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ సాంగ్స్ చాలా రాశారు చంద్రబోస్. బడ్జెట్ పద్మనాభంలో ఏవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజువు నువ్వే బంటూ నువ్వే అన్న స్ఫూర్తిదాయకమైన పాట అందరినీ ఆలోచింపజేసింది. నేనున్నాను చిత్రంలో చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని పాట ఇప్పటకీ అందరూ పాడుతూనే ఉంటారు. గుడుంబా శంకర్‌లోనూ ఇంతే ఇంతింతే సాంగ్‌ కూడా మంచి సెన్సేషన్ అయ్యింది.

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

ఇక ఇప్పటికీ మదర్స్ డే వచ్చినా ప్రతి ఒక్కరు స్టాటస్ పెట్టుకునే పాట ఏదైనా ఉందా అంటే అది పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ అన్న సాంగ్. నాని చిత్రంలో మంచి సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ పాటను రాసిందే చంద్రబోసే. ఆ పాటలో ప్రతి పదం ఎంతో తేలికగా ఉన్నా తల్లి ఒక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సాంగ్ ఆ సినిమాకే మంచి హైలెట్ గా నిలిచింది. ఢమరుకం చిత్రంలోనూ తల్లి పాటను రాశారు చంద్రబోస్. లేలేలే ఇవ్వాళే లే అన్న పాట కూడా ప్రేక్షకులను అలరించింది. మనం చిత్రంలోనూ కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా సాంగ్ కూడా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

ప్రేమ పాటల స్పెషలిస్ట్ చంద్రబోస్. ఈయన రాసిన ప్రతి పాటను యూత్‌ ఓ రేంజ్ లో ఆధరించింది. ఆది సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది అన్న సాంగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వొస్తావని చిత్రంలో కలలోనైన కలనగనలేదే నువ్వొస్తావని అన్న పాట ఆ చిత్రంలో స్పెషల్ సాంగ్. ఆ పాటకి కూడా మంచి క్రేజ్ లభించింది. ఒకరికొకరులో నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష అన్న పాట ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటుంటారు. విరహ వేదన నిండిన ఈ పాట ఎందరినో కదిలించింది. మగధీరలో పంచదార బొమ్మ సాంగ్ తో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ లిరిసిస్ట్. ఆ సాంగ్ విమర్షకులను సైతం మెప్పించింది.

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

శోకంతో నిండిన పాటలను రాయగలరు ఈయన. రంగస్థలంలో ఈయన రాశిన ఓరయ్యో నా అయ్యా.. ఓరయ్యో నా అయ్యా..ఈ చేతితోనే బువ్వ పెట్టాను.. అన్న పాట విన్న ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. సన్నివేశాలకు తగ్గట్లుగా పాటలు రాయగల నేర్పరి ఈ రచయిత. ఎంత ఏడ్పించగలరో అంతగా ఎంటర్‌టైన్ చేయగలరు. రంగస్థలంలోనే ఐటం సాంగ్ రాశారు. కుర్రకారును రెచ్చగొట్టారు. జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా లేటెస్ట్‌గా పుష్పలోనూ మంచి ఐటమ్ సాంగ్ రాశారు చంద్రబోస్. సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా చేసిన ఊ అంటావా..ఊహూ అంటావా సాంగ్ రాసింది చంద్రబోసే. ఈ సాంగ్‌పైన అనేక విమర్షలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు రచయితకే ఓటేసి ఆ పాటను సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలబెట్టారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!