Connect with us

Featured

Dasari Narayana Rao : ఐదు నందులు తెచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన ఆడవాళ్ళ చిత్రం… కంటే కూతురునే కనాలి…!

Published

on

Dasari Narayana Rao : సినిమా అనగానే భారీ ఫైట్లు, హీరో తొడగొట్టే సన్నివేశాలు, హీరోయిన్ తో రొమాన్స్ ఇలాంటి కమర్షియల్ సినిమాలకు కొదవ లేదు. మరీ ముఖ్యంగా హీరోల ఎలివేషన్ లో ఎక్కడో కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ ను చూపించి గ్లామర్ కోసం మాత్రమే అన్నట్టుగా పెట్టుకునే సినిమాలకు తెలుగులో కొదవలేదు. అలాంటి సినిమాలే వస్తున్నాయి అంటే ప్రేక్షకులు కేవలం హీరో సెంట్రిక్ సినిమాలనే ఇష్టపడుతున్నారా..? కొత్తగా కథ చెబితే ప్రేక్షకులు ఊ కొట్టరా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వచ్చిన చిత్రాలే కర్తవ్యం, ప్రతిఘటన, ప్రతిధ్వని, ఒసేయ్ రాములమ్మ, కంటే కూతురినే కనాలి. ఈ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారని నిరూపించుకున్నాయి.

కానీ ఇటువంటి సినిమాలు ఎపుడో ఒకసారి అలా వచ్చిపోతుంటాయి. కానీ ఆ సినిమాల ప్రభావం మాత్రం జనాలపై పోదు. ఇక అలాంటి ఒక చిత్రం గురించే ఇపుడు చెప్పబోయేది. అదే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన కంటే కూతురినే కనాలి సినిమా. దాసరి నారాయణరావు గారు అప్పటికే ఒసేయ్ రాములమ్మ అంటూ తెలంగాణ బిడ్డ సినిమా తీసి 1998 లో సంచలనం సృష్టించారు. ఇక ఆతరువాత ఆయన తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ గ్రీకు వీరుడు అనే సినిమా తీసినా అది జనాలకు ఎక్కలేదు. ఇక మరోసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రానికే ఆయన మొగ్గుచూపారు. పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్ళ గొప్పతనం సునిశితంగా చెప్పిన చిత్రం అది.

ఐదు నందులు అందుకున్న కంటే కూతురినే కనాలి….

Advertisement

ఇక రమ్య కృష్ణ , జయసుధ ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రంలో దాసరి, జయసుధ భర్తగా ప్రభుత్వ మాస్టారు పాత్రలో నటించారు. ఇక బ్రహ్మానందం, నర్రా, బ్రాహ్మజీ, పృథ్వీ, జే వి సోమయాజులు, పీ జే శర్మ, ఆలీ, తనికెళ్ల భరణి, అల్లు రామలింగయ్య నటించారు. కేవలం 25 రోజుల షూటింగ్ ప్రణాళికతో తక్కువ బడ్జెట్ తో సినిమా రూపొందించారు దాసరి. కథా, స్క్రీన్ ప్లే దాసరి గారైతే, ఆయన శిష్యుడు మధు తోటపల్లి సంభాషణలు రాసారు. ఇక ఈ సినిమాలో కంటే కూతురినే కనాలిరా… అంటూ సాగే పాట ఇప్పటికి వింటూనే ఉన్నాం. అటువంటి గుర్తుండిపోయే సంగీతాన్ని అందించింది వందేమాతరం శ్రీనివాస్ గారు. ఇంటికి వారసుడు ఉండాలి, తండ్రి పేరును నిలబెట్టేది, వృధాప్యంలో తోడుండేది కొడుకే అంటూ కొడుకును మాత్రమే కనాలి, కూతుర్లు భారం అని తలచే చాలామంది భావనలు తప్పు అని చాలా సున్నితంగా చూపించిన చిత్రం ఇది.

కూతురు వంటింటికే పరిమితమని చదివించడం అనవసరం అనే రోజుల్లో ఒక కూతురు కూడా తల్లిదండ్రుల భాద్యత తీసుకోగలదని, పురుషాధిక్య సమాజాన్ని ఆలోచింపగలిగేలా చేసిన చిత్రం. అందుకే ఈ సినిమాకు జనాల నీరాజనాలతో పాటు ఐదు నందులు కూడా వచ్చాయి. ఈ తరం వారికి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీసే దర్శకుల కోసం సినీ పరిశ్రమ కచ్చితంగా ఎదురుచూస్తోంది. అప్పుడైనా ఇప్పుడైనా కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. కేవలం సినిమాను ఒక వ్యాపారంలా చూసే ధోరణి నుండి బయటికి వచ్చి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే చిత్రాలను తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!