General News
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..! భర్త, అత్తామామలు ఇచ్చిన బహుమానం ఇది..!
Published
2 years agoon
By
lakshanaCrime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆ మహిళ. మొదట్లో భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నా.. తర్వాత వారి వక్రబుద్ది బయటపడింది. అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక తనవు చాలించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో దొర్ల శోభ–వెంకట్ రెడ్డిలు దంపతులు. వీళ్లకు 28 ఏళ్ల ప్రవళిక అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన చామకూర మహేష్ ను ప్రేమించింది. మొదట వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. పోరాడి ప్రేమను సాధించుకొని వివాహం చేసుకున్నారు.
ఐదేళ్ల క్రితం అతడికి అమ్మాయి తరఫు తల్లిదండ్రలు కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవడంతో.. లాంఛనాలతో అన్ని అబ్బాయికి ఇవ్వాల్సినవి ఇచ్చారు.
పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ..
బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కూడా ఇచ్చారు. మొదట వీరి కాపురం ఎలాంటి ఆటంకాలు.. మనస్పర్థలు లేకుండా సాగింది. అయితే మహేష్ మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. తర్వాత అతడి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అతడు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని అటు భర్తతో పాటు.. అత్తమామలు వేధించడం సాగించారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆరు నెలల క్రితం రూ.4లక్షలను అదనపు కట్నం కింద ముట్టజెప్పారు. అయినా ఆ దుర్మార్గుడికి ఆశ చావలేదు. ఇంకా కావాలని బలవంతం చేయడంతో.. భరించలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో ఏముందంటే.. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, ‘అమ్మా నాన్న మిస్ యూ అంటూ’ ఆమె సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనిపై ఆ వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
You may like
Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?
Barrelakka: ఎట్టకేలకు కాబోయే వాడిని పరిచయం చేసిన బర్రెలక్క.. అబ్బాయి ఏం చేస్తారో తెలుసా?
Ananya Nagalla: కాబోయే భర్త అలాగే ఉండాలి.. మనసులో కోరికలు బయటపెట్టిన అనన్య?
Ileana: వారిని ఏమైనా అంటే తట్టుకోలేను.. ఇలియానా లేటెస్ట్ పోస్ట్ వైరల్!
Amalapaul: బేబీ బంప్ తో పబ్ లో డాన్స్ చేస్తున్న అమలాపాల్.. ఏం సందేశం ఇస్తునావంటూ ట్రోల్స్?
Varalakshmi: పెళ్లయిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరలక్ష్మి.. ఇదేం ట్విస్ట్ అంటూ?
General News
ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Published
2 weeks agoon
25 June 2024By
lakshanaఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.
జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.
ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
Featured
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
Published
1 month agoon
8 June 2024By
lakshanaRamoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూత..
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.
Featured
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు
Published
2 months agoon
21 May 2024By
lakshanaసైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్ క్రైమ్ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.
కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.
Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?
VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?
Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!
Deepika Padukone: చీరలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన దీపికా… చీర ధర, ప్రత్యేకత ఏమిటో తెలుసా?
SJ Surya: నా మిత్రుడు పవన్ ఏదో ఒక రోజు ఏపీ సీఎం అవుతాడు.. పవన్ పై ఎస్ జె సూర్య కామెంట్స్!
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?
Sri Reddy: అది నిరూపిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా తిరుగుతా: శ్రీ రెడ్డి
Trending
- Featured4 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured2 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?
- Featured4 weeks ago
Sri Reddy: అది నిరూపిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా తిరుగుతా: శ్రీ రెడ్డి
- Featured4 weeks ago
Ramoji Rao: రామోజీరావు ఆస్తుల విలువ ఎంత ఆయన ఆస్తులకు వారసులు ఎవరో తెలుసా?
- Featured4 weeks ago
Mahasena Rajesh: నన్ను సస్పెండ్ చేయాలంటే ముందు ఆ పని చేయాలి: మహాసేన రాజేష్
- Featured4 weeks ago
Vishwambara: విశ్వంభరలో మరో మెగా హీరో.. హిట్టుకోసమే ఈ హడావిడి!