Connect with us

Featured

Analyst Damu Balaji : రామోజీరావు ని విచారించిన సిఐడి అధికారులు… సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి…: అనలిస్ట్ దాముబాలాజీ

Published

on

Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపిస్తోంది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రామోజీ కి సంబంధించిన వీడియోస్ బయటికి రావడంతో చర్చ మొదలయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ మాస్టర్ ప్లాన్ లో భాగమే…

రామోజీ రావు గారి మీద రాజకీయ కక్ష్యలో భాగంగా ఏపీ సీఎం జగన్ కావాలనే మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయని కేసు వేయించి అరెస్టు చేయించాలని చూస్తున్నారంటూ రామోజీ తరుపున వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని అందులో చిట్ ఫండ్ కట్టిన ప్రజలు ఎవరూ కేసు వేయలేదు కేవలం ఒక్క జిల్లాలో చిట్ ఫండడ్ కి సంబంధించిన ప్రభుత్వ అధికారి అందులో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే రామోజీ రావు గారి వ్యాపారాలను టార్గెట్ చేసారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈ బాధ్యత అప్పగించారు. మార్గదర్శి కంపెనీ హిందూ అవిభజ్య కుటుంబ సంస్థ గా ఏర్పడింది. ఈ విషయం మీదే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కేసు వేశారు. అయితే హై కోర్ట్ లో ఈ కేసు కొట్టేయగా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్ట్ కి వెళ్లారు. అయితే ఈ కేసులో ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం వేసింది. అలా కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.

Advertisement

అలాగే సిఐడి దృష్టికి వెళ్లడానికి కారణం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లోని జిల్లాకు చెందిన అధికారులు మార్గదర్శి మీద ఫిర్యాదు చేయడం వల్ల సిఐడి ఏడు కేసుల్లో A1 గా రామోజీ రావు, A2 గా మార్గదర్శి ఏండి శైలజ కిరణ్ ను పేర్కొన్నారు. మార్గదర్శిలో ప్రజల డబ్బునంతా ఇతర తమ వ్యాపారాల్లోకి అలాగే మూచ్యువల్ ఫండ్స్ లోకి మళ్ళించారని ఇది చిట్ ఫండ్స్ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు అంటూ బాలాజీ వివరించారు. అంతే కాకుండా తాజాగా విడుదల అయిన వీడియోలో రామోజీ రావు గారు తనకు 87 ఏళ్ల వయసు antu సీఐడి అధికారులతో చెప్పడం, తనకు గుండె సమస్యలు ఉన్నాయని చెప్తున్నా వాళ్ళు మీరు పడుకోండి మేము ప్రశ్నలు అడుగుతాం అనడం, నా ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వదలరా అంటూ రామోజీ మాట్లాడటం ఉంది అంటూ చెప్పారు. రామోజీ రావు గారు ఇంతవరకు నన్ను పోలీసులు విచారించింది కానీ ఎపుడు జరగలేదు అంతా జగన్మాయా అంటూ మాట్లాడటం వీడియోలో తెలుస్తుంది. కావాలనే తప్పుడు కేసులు వేశారనే భావనలో మాట్లాడారు రామోజీ అంటూ బాలాజీ తెలిపారు. ఈ విషయంలో ఉండవల్లి మాత్రం ఆయన చెప్పేవి ఆపద్ధాలు, మార్గదర్శి పెట్టకముంది ఆయన ఒక రూమ్ లో చిట్ ఫండ్ నడిపేవాడు, అపుడు నాలుగు రోజులు అరెస్టు అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అంటూ విమర్శించారని బాలాజీ తెలిపారు.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!