Connect with us

Featured

దేశ ప్రజలకు అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారా..? ఇవ్వరా..?

Published

on

భారతదేశంలో ప్రజలకు కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దేశంలోని ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుందని భావిస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయడం లేదు. తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో వ్యాక్సిన్ తీసుకునే వారికి మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తొలి దశలో 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.

ఆ తరువాత వ్యాక్సిన్ ను ప్రజలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. నీతి అయోగ్ సభ్యులలో ఒకరైన డాక్టర్ వినోద్ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి దశ కరోనా వ్యాక్సిన్ భారాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. దేశంలోని 29 వేల వ్యాక్సినేషన్ పాయింట్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ కోసం 31 హబ్ లను ఏర్పాటు చేసింది.

మొదట వృద్ధులు, ఆరోగ్యశాఖలో పని చేసేవారికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కేంద్రం కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. మరోవైపు సీరమ్ సంస్థకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం గురించి స్పందిస్తూ మన దేశంలోని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన డేటాను కూడా పరిశీలిస్తున్నామని అన్నారు.

కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇంజెక్షన్ రూపంలో కండరాల్లోకి ఎక్కే విధంగా ఇస్తారు. తొలి డోస్ కు, రెండో డోస్ కు 4 నుంచి 6 వారాల గ్యాప్ ఉంటుంది. వ్యాక్సిన్ ను ఇచ్చిన తరువాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించి నివేదికను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాత్రం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ గురించి స్పష్టత రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!