Connect with us

Featured

పాపం సుజాత.. తోలు బెల్టుతో భర్త చేతిలో చావు దెబ్బలు అనుభవించింది…!!

Published

on

హీరోయిన్ సుజాత.. అప్పటి కాలంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో ఈవిడ కూడా ఒకరు. హీరోయిన్ సుజాత పేరు వింటే మనకు మొదటిగా గుర్తొచ్చే సినిమా గోరింటాకు. 1952 డిసెంబర్ 10న పుట్టిన సుజాత తనకు 14 సంవత్సరాల సమయం లోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో మొత్తంగా మూడు వందలకు పైగా సినిమాల్లోనే నటించింది. ఇక ఈవిడ చివరి సినిమా శ్రీరామదాసు. ఇక సుజాత తండ్రి ఇ ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలే లో పని చేసేవారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆవిడ శ్రీలంక లోనే పుట్టి పెరిగింది. ఆయన తండ్రి రిటైర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇండియాకు వచ్చేసింది.

ఇక తనకు 14 సంవత్సరాల సమయంలోనే 1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్ లో ‘ అవ్వాలోరు తుధల్ కథై ‘ సినిమాతో పరిచయమైన ఆవిడ ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశన్ వంటి వారితో ఎన్నో చిత్రాల్లో కలిసి పనిచేసింది. ఇక టాలీవుడ్ పరిశ్రమకు గోరింటాకు సినిమా ద్వారా ఆవిడ పరిచయం అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఆవిడ టాలీవుడ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలలో ఛాన్సును దక్కించుకుంది. అప్పటి బడా హీరో లైన సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇలా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఉంటున్న ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అతని పేరు జయకర్. ఇక వీరిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఇలా జయకర్ ను వివాహం చేసుకున్న ఆవిడ కొన్ని రోజులు అమెరికాకు అతనితో కలిసి వెళ్లి పోయింది.

అయితే ఆమెకు అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి మళ్లీ ఇండియాకు చేరుకుంది. ఇండియాకు వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే, సినిమాలలో అనేక మంది బడా హీరోలతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇంట్లో మాత్రం ఆవిడ పరిస్థితి వేరేగా ఉండేది. సుజాత భర్త జయకర్ సొంతంగా ఏ పని చేయకపోయినా ఇంట్లో ఉంటూ ఆమెను శతవిధాల చిత్రహింసలకు గురి చేసేవాడు. ఒక్కోసారి ఆమె షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగే గొడవల్లో ఆమెను తన భర్త బెల్టుతో కూడా కొట్టిన సందర్భాలు లేకపోలేదు. అంతేకాదు కొన్ని సార్లు షూటింగ్స్ జరిగే స్పాట్ లో కూడా ఆమెపై చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయని అప్పట్లో చర్చించుకునేవారు. అయితే ఆవిడ ఎన్నో సినిమాల్లో ఎన్నో కష్టాలను రీల్ జీవితంలో భరించిన ఆవిడ రియల్ లైఫ్ లో కూడా ఆ అనుభవాలను చూసింది. అయితే బడా హీరోల తో అంత మంచి పేరు తెచ్చుకున్న ఈవిడకు సినిమాలు తగ్గడానికి కారణం కూడా ఆమె భర్తనే. ఎవరైనా సినిమా దర్శక నిర్మాతలు సినిమా చేయమని అడగడానికి వస్తే వారికి దిమ్మతిరిగేలా కండిషన్స్ పెట్టి చివరికి ఆమెకు అవకాశాలు లేకుండా చేశాడు తన భర్త జయకర్.

ఇలా తన జీవితం కొనసాగుతున్న సమయంలో ఆవిడ ఒక వైపు సినిమాలలో హీరోయిన్ గా చేసిన రోజులు తర్వాత తల్లిగా, వదినగా, అక్కగా ఇలా విభిన్న రోల్స్ చేస్తూ తెలుగు అభిమానులను మెప్పించింది. ఈమెకు టాలీవుడ్ లో గోరింటాకు, సూత్రధారులు, సర్కస్ రాముడు, సూరిగాడు, వంశ గౌరవం, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, చంటి, పెళ్లి లాంటి చిత్రాల్లో ఆమె నటన మంచి మార్కులే పడ్డాయి. అలాగే 1997 సంవత్సరంలో ఆమె నటించిన పెళ్లి సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెస్ట్ క్యారెక్టర్ రోల్ గా నంది అవార్డును కూడా ప్రకటించింది. అంతే కాదు తమిళనాడు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే కళైమామణి అవార్డును కూడా ఆవిడ దక్కించుకున్నారు. ఇక చివరి సినిమా శ్రీరామదాసు నటించిన తర్వాత కొద్ది కాలానికి ఆమె అనారోగ్యం బారిన పడి చివరికి 58 సంవత్సరాల వయసులో 2006 లో చెన్నై నగరంలో ఉన్న తన ఇంట్లోనే ఆవిడ కన్నుమూసింది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!