Connect with us

Featured

ఎంత చేయాలో అంతా చేస్తుంది.. ఏమివ్వాలో అది ఇస్తుంది.. అయినా నివేతా పేతురాజ్..

Published

on

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని విధాలుగా కష్టపడాలో అన్ని విధాలుగా కష్టపడతారు. ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చినా ఎంతో శ్రమించి చేస్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకి తగ్గ న్యాయం చేస్తారు. కానీ ఎందుకనో వారికి తగిన గుర్తింపు మాత్రం రాదు. వరుసగా అవకాశాలు వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నా కూడా స్టార్ స్టేటస్ అందుకోవడంలో మాత్రం వెనకబడి పోతుంటారు. నటన రాని కొంతమంది ముంబై హీరోయిన్స్ కంటే పదిరెట్లు బెటర్ అనిపించుకున్నా పెద్ద హీరోలతో నటించే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతుంటారు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అనే సామెత మాదిరిగా కొంతమంది కెరీర్ లో పైకి రావడానికి కిందా మీదా పడుతుంటారు.

అలాంటి అమ్మాయి నివేతా పేతురాజ్. టాలీవుడ్ సినిమాలలో మంచి పాత్రలే చేస్తోంది. అందం, అభినయం కూడా బాగానే ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మది’లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ యంగ్ బ్యూటి. హాట్ హాట్ అందాలతో నివేతా పేతురాజ్ మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన బాగానే రొమాన్స్ సీన్స్ లో నటించి ఇండస్ట్రీ దృష్ఠిని బాగానే ఆకట్టుకుంది.

‘మెంటల్ మది’లో  సినిమా తర్వాత నివేతా పేతురాజ్ కి సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ వార్త చూడగానే.. ఈమె మెగా ఫ్యామిలీలో పడిందంటే ఇక దశ దిశ తిరిగినట్టే అనుకున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్ర లహరి’లో సెకండ్ లీడ్ గా నటించింది. కానీ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నివేతా పేతురాజ్ కి అంతగా దక్కలేదు. ఇక మరోసారి శ్రీ విష్ణు నటించిన ‘బ్రోచేవారేవరురా..’ లో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో బాగానే అదరగొట్టింది నివేతా పేతురాజ్.

కానీ క్రెడిట్ మొత్తం నివేత థామస్‌కే వెళ్ళిపోయింది. అయినా ఈ హాట్ బ్యూటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ లో నటించి బంగారం లాంటి అవకాశం అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ పూజా హెగ్డే తప్ప ఈమె ఎవరి కంటీ కనిపించలేదు పాపం.  

ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన మంచి రీల్ చేసింది. పోలీస్ పాత్రలో బాగా ఆకట్టుకుంది. కానీ హీరోయిన్ పాత్ర కాకపోవడం, గ్లామర్ గా చేయడానికి ఒక్క పాట కూడా లేకపోవడం నివేతా పేతురాజ్ కి రెడ్ సినిమా అంతగా ఉపయోగపడలేదు. ఇక తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ సరన పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేతా పేతురాజ్. ఈ సినిమాతోనైనా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతుందా చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!