Connect with us

Featured

పూరి జగన్నాథ్ సూపర్‌ సినిమాలో ఛాన్స్ కోసం అనుష్కని ఎన్ని నెలలు వెయిట్ చేయించారో తెలుసా ?

Published

on

టాలీవుడ్‌లో అనుష్క మోస్ట్ సీనియర్ హీరోయిన్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పటికే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్.ఓ బ్రాండ్. సున్నితమైన మనస్తత్వం..గొప్పలు పోని అనుష్క శెట్టి..స్వీటీగా అందరి మనసులను దోచుకుంది. పేరుకు తగ్గట్టే స్వీటీ చాలా స్వీట్ పర్సన్ అని ఇండస్ట్రీలో ఆమెతో పనిచేసిన ప్రతీ ఒక్కరు చెబుతుంటారు. అనుష్క మాతృ భాష తుళు. అయినా తెలుగమ్మాయిలా చక్కగా, అందంగా కనిపిస్తుంది. అంతే అందంగా తెలుగులో మాట్లాడుతుంది. ఈమె సినిమాలలోకి రాకముందు యోగా శిక్షకురాలుగా పనిచేశారు. అప్పటి వరకు స్వీటీశెట్టిగా అందరూ పిలిచేవారు. సినిమాలలోకి వచ్చాక తన పేరు అనుష్కగా మారింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనకి అనుష్క అని పేరుపెట్టింది ఎవరో అని అనుకుంటారు. కానీ ఆపేరు అనేది అనుష్కకి ఎవరు పెట్టలేదు. తనకి తనే ఈ పేరు పెట్టుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో వస్తుందని ఎవరూ అనుకోరు. అనుష్క కజిన్స్ అందరూ తనకంటే చాలా అందంగా ఉంటారట. అయినా వాళ్ళకి రాని అవకాశం అనుష్కకి ఎలా వచ్చింది అని ఇప్పటికి అర్థం కాదట. ఇక అనుష్క అమ్మగారు అన్నీ సినిమాలు చూస్తారట. ఒకవేళ సినిమా నచ్చితే చాలాసేపు మాట్లాడతారట. సినిమా గనక నచ్చకపోతే వెంటనే టాపిక్ మార్చేస్తారట. ఇక ఇప్పటివరకు అమ్మగారు అంతగా గొప్ప అప్రిషియేషన్స్ ఇచ్చింది లేదట.

ఇక అనుష్క చేసిన సినిమాలలో సూపర్, వేదం, రుద్రమదేవి, అరుంధతి, బిల్లా లాంటి సినిమాలు చాలా ఇష్టం అని చెప్పారు. అయితే సూపర్ అనుష్క సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. ఇది తెలుగు డెబ్యూ మూవీ. యోగా టీచర్‌గా 6 ఏళ్ళు పనిచేశారు. అయితే సంపాదన వచ్చింది మాత్రం తక్కువ. కానీ ఫ్యాషన్ కాబట్టి చేసింది. అయితే తన తోటీ సన్నిహితుల ద్వారా పూరి జగన్నాథ్ పరిచయం అయి సూపర్ సినిమాలో అవకాశం అందుకుంది. అప్పటి వరకు పూరి జగన్నాథ్ సినిమాలు ఏవీ చూడలేదు. మొదట్లో చాలాసార్లు పూరి నుంచి ఎస్కేప్ అయింది. అందుకు కారణం ఆమెకి సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదట. దానివల్లే తను పూరి నుంచి తప్పించుకోవాలని చూసింది.

అయితే పూరి సినిమా అంటే కెరీర్ లో గొప్ప అవకాశం అని భూమిక భర్తతో పాటు మిగతా వాళ్ళు చెప్పారట. అలా సూపర్ సినిమా ఆడిషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆడిషన్స్ సమయంలోనే భయపడి వెళ్ళిపోవాలనుకుంది. ఫస్ట్ ఆడిషన్స్ లోనే తనకి ఏమీ తెలీదనే విషయం అర్థం చేసుకున్న నాగార్జున – పూరి జగన్నాథ్ తనని మానసికంగా సిద్దం చేసేందుకు దాదాపు 9 నెలలు అలా షూటింగ్ స్పాట్‌లో కూర్చో బెట్టారట. రోజూ ఓ అసిస్టెంట్ గా వచ్చి కూర్చునేదట. అలా 2005 మార్చ్ 12న మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఇక మొదటి సినిమాలో గ్లామర్ రోల్ కాబట్టి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు బాగా ఏడ్చిందట. దాదాపు ఇలా సంవత్సరం పైనే ఇబ్బంది పడిందట. కానీ ఈరోజు అనుష్క ఓ స్టార్ .. ఈ స్టార్‌ని బీట్ చేయగలిగేవారు లేరు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!