Connect with us

Political News

దళిత బంధుకు ఆదిలోనే అడ్డంకి!

Published

on

తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొంత మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు కోసం అన్ని గ్రామాల్లో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు గ్రామం నుంచి 8 మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.

Advertisement

Featured

RK Roja: వైయస్సార్ జయంతి… ఆసక్తికర ట్వీట్ చేసిన ఆర్కే రోజా?

Published

on

RK Roja: ఆర్కే రోజా పరిచయం అవసరం లేని పేరు సినీ నటిగా రాజకీయ నాయకురాలుగా ఎంతో సపరిచితం. వైఎస్ఆర్సిపి పార్టీలో మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి ఈమె ఇటీవల ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. అయితే ఇలా ఓటమి పాలైన ఈమె బీజేపీలోకి వెళ్తారని అందరూ భావించినప్పటికీ ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు..

ఇకపోతే తాజాగా నేడు వైయస్సార్ 75వ జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వైయస్సార్ ను గుర్తు చేసుకుంటూ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ అభిమానులు కార్యకర్తలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సైతం ట్విట్టర్ వేదికగా వైయస్సార్ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రోజా ట్విట్టర్ వేదికగా వైయస్సార్ గురించి తెలియజేస్తూ.. రోడ్డు ప్రమాదాలలో మరణాలను వీలైనంత తక్కువ చేయడానికి 108 అంబులెన్స్‌లను తీసుకువచ్చారనీ రోజా తెలిపారు.ఈ 108 అంబులెన్స్ ఆవిష్కరణ రాష్ట్ర వైద్య చరిత్రలోనే ఓ సంచలనంగా నిలిచిందని తెలిపారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఉన్నారు…
ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎంతోమందికి పునర్జన్మ ప్రసాధించిన దేవుడు వైయస్ఆర్ గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. వైయస్సార్ గారు చేసిన ఎన్నో మంచి పనులను మనం మర్చిపోకూడదని తెలిపారు.. వైయస్సార్ మన మధ్య లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులై ఉంటారంటూ ఈ సందర్భంగా రోజా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

AP politics: తండ్రి జయంతి.. అన్నకు బిగ్ షాక్ ఇచ్చిన షర్మిల… ఇక జగన్ కి కష్టమేనా?

Published

on

AP politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగా ఉంటాయి. ఇకపోతే నేడు దివంగత నేత వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో ఇప్పటికి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి వైయస్సార్ ని గుర్తు చేసుకున్నారు.

వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల జగన్ ఇద్దరు కూడా ఒకేసారి అక్కడికి చేరుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసిన షర్మిల నో చెప్పారని తెలుస్తుంది. ముందుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తన తండ్రికి నివాళులర్పించారు. ఇక వైయస్ విజయమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిన అనంతరం వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో పాటు తండ్రి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక ఈమెతో పాటు తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇలా తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం వైయస్ షర్మిల విజయవాడకు వెళ్లిపోయారు.

Advertisement

విజయవాడలో వైయస్సార్ జయంతి వేడుకలు..
విజయవాడలో నేడు కాంగ్రెస్ పార్టీ నేతలతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు అంతేకాకుండా ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా బలహీన పడటంతో ఆ పార్టీలో ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకురావడం కోసం షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కనుక సక్సెస్ అయితే తిరిగి ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడమే కాకుండా జగన్ వైసీపీ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

YS Jagan Mohan Reddy: నాన్న మీ మార్గం శిరోధార్యం… ఎమోషనల్ ట్వీట్ చేసిన వైయస్ జగన్!

Published

on

YS Jagan Mohan Reddy: మహానేత దివంగత నాయకుడు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి వేడుకలు నేడు ఎంత ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇక వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకొని ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇక జగన్ ఇడుపులపాయకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమని భారతి కూడా ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

ఇకపోతే వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని చూసే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇలా తల్లితో కలిసి వైఎస్ జగన్ దంపతులు తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన తండ్రి గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Advertisement

వైయస్సార్ జయంతి వేడుకలు..
నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి అంటూ వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!