Connect with us

General News

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

Sukuamar: సంక్రాంతి పండగ పేరు చెప్తే వెంటనే గుర్తుకు వచ్చేది కోనసీమ, కోస్తా జిల్లాలు. అక్కడ సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. కోడి

Published

on

Sukuamar: సంక్రాంతి పండగ పేరు చెప్తే వెంటనే గుర్తుకు వచ్చేది కోనసీమ, కోస్తా జిల్లాలు.  అక్కడ సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. కోడి పందాలు, ఇంటి ముందు ముత్యాల ముగ్గులు, ఆడపడుచుల అందాలు, కొబ్బరి తోటలు గుర్తుకు వస్తాయి. కోస్తా జిల్లాల ప్రజలు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి సొతూళ్లకు వెళ్ళడం ఆనవాయితీ. సంక్రాంతిని పెద్ద పండుగ చెబుతుంటారు వారంతా.

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!
Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా తన సంక్రాంతి అనుభవాలను పంచుకున్నారు. చిన్నతనంలో చేసిన సందడి.. పెళ్లయిన తర్వాత వచ్చిన మార్పుల గురించి వివరించారు. సుకుమార్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గర్లో ఉన్న మట్టపర్రు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే తీర్థాలు, కోడి పందాలు.

Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!
Sukuamar: పెళ్లైన కొత్తలో తాను అలా ఉండేవాడిని..! ఆ విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్..!

అయితే సుకుమార్ ఊరుకు దగ్గర్లో శివకోడు ముసలమ్మ తీర్థం జరిగేదట. అక్కడ పెద్ద సంత జరుగుతుందట. ఆ సమయంలో ఒక పెద్ద నాన్నకి తెలియకుండా మరో పెదనాన్న ఇచ్చే జీడిపాకం రుచి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంతలో ఏమైనా కొనుక్కోమని తన తల్లి ఇచ్చే డబ్బులను తీసుకొని.. ఆమెకే పకోడీ ఖర్జూరం కొనిచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు సుకుమార్.


వేసవిలో తన సినిమాలను విడుదల చేసే సుకుమార్..

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి ప్రస్తావించారు. తన భార్య, తల్లి మధ్య యాస వల్ల వచ్చిన ఇబ్బందులను చెప్పుకొచ్చారు. తన భార్య తబిత ది తెలంగాణ, తల్లిగారి ది పక్క గోదావరని.. దీంతో ఇద్దరి మధ్యలో మాట్లాడేటప్పుడు యాస సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు సుకుమార్. పెళ్లయిన ఏడాది సంక్రాంతికి సొంతూరు వెళ్ళినప్పుడు తన తల్లి గారు చెప్పే మాటలు తన భార్య తబితకు అర్థం కాకపోయేవని.. దీంతో వీరిద్దరి మధ్య ట్రాన్స్లేటర్ గా కొత్త అవతారం ఎత్తారట సుకుమార్. సంక్రాంతి సమయంలో తన భార్యకు ఊరంతా తిప్పి చూపానని చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ అయ్యాక జరుపుకుంటున్న సంక్రాంతి ‘వన్’ సమయంలోనే చెప్పారు. సాధారణంగా సుకుమార్ వేసవి సమయంలో తన సినిమాలను విడుదల చేస్తుంటారు. దీంతో సంక్రాంతి సమయంలో వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేది. అయితే ‘వన్’ విషయంలో సంక్రాంతి సమయానికి సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీంతో సొంతూరు వెళ్లి సంక్రాంతి హ్యాపీ గా జరుపుకున్నారని తెలిపారు సుకుమార్.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!