Connect with us

Featured

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

Published

on

ఆ సంవత్సరంలో స్టార్ హీరోలైన కృష్ణ, చిరంజీవి, నాగార్జున బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. అందులో ముందుగా విడుదలైన “ముగ్గురు మొనగాళ్ళు” 1994, జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. 

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు. రంగనాథ్, శ్రీవిద్య తమ కుమారులు పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ (చిరంజీవి త్రిపాత్రాభినయం)లతో ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపివేస్తాడు.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ పృథ్వీ నుండి విడిపోతుంది. గూండాల నుండి తప్పించుకునేటప్పుడు తన కొడుకు చంపబడ్డాడని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకును దత్తత తీసుకుంటాడు, శ్రీవిద్యతో ఉన్న విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ నృత్య ఉపాధ్యాయుడు. సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిసారు, విలన్లపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించారు.ఈ చిత్ర గీతాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్…. తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ. పెద్ద కుమారుడిగా ఘట్టమనేని కృష్ణ నటించారు. కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపించారు.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
1994 జనవరి 21 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో “గోవిందా గోవిందా” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది… ఆ సంవత్సరం జనవరి నెలలో ఒక వారం తర్వాత మరొక చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాయి.. నాగార్జున హీరోగా నటించిన “గోవిందా గోవిందా ” చిత్రం పరాజయం పొందింది, మెగాస్టార్ నటించిన “ముగ్గురు మొనగాళ్ళు” “యావరేజ్ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “నెంబర్ వన్” చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!