Connect with us

Featured

కన్నీళ్లు పెట్టిస్తున్న కోవిడ్ పేషెంట్ మాటలు..?

Published

on

ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరస్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు అధికంగా కేసులు నమోదు అవడమే కాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించగా మృత్యువాత పడుతున్నారు.

తాజాగా ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బెల్లంకొండ కృష్ణగౌడ్ కరోనా బారినపడి సోమవారం మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆసుపత్రిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ఇతని మాటలు వింటే వైరస్ ఏ విధంగా ప్రజలను బలి తీసుకుంటుందో అర్థమవుతుంది.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్‌ ఓయూలో విద్యార్థి ఐకాస నేతగా ఉన్నారు. కొవిడ్‌ బారినపడిన ఆయన పది రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆదివారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసి తనని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని, తనకు శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదని వెంటనే నన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించమని తన భార్యను వేడుకున్నాడు.

Advertisement

కృష్ణ గౌడ్ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం నిమ్స్ లో కన్నుమూశారు. డాక్టర్లు మాత్రం అతనిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని, అతని పరిస్థితి విషమం కావటం వల్లే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Advertisement

Featured

YS Sharmila: ఏపీ రాజకీయాలకు వైయస్ షర్మిల గుడ్ బై చెప్పినట్టేనా.. డిపాజిట్లు కూడా రావా?

Published

on

YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా కొన్ని సర్వేలు కూటమికి అధికారం రాబోతుందని చెప్పగా మరికొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి తిరిగి విజయం సాధిస్తారని వెల్లడించారు. ఇకపోతే ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీ రాజకీయాలలోకి వచ్చి సంచలనంగా మారారు వైయస్ షర్మిల.

ఎవరు ఊహించని విధంగా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏపీపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూడు నెలల కాలంలో వైఎస్ షర్మిల తన అన్నయ్య ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా కీలకమైన సబ్జెక్ట్ ఎంచుకొని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేసినటువంటి షర్మిల ఎలాగైనా ఈ ఎన్నికలలో ఒక ఐదు నుంచి పది స్థానాలలో విజయం సాధిస్తారని అందరు భావించారు. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే మరోసారి కాంగ్రెస్ ఏపీలో చతికిల పడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక కడపలో ఎంపీగా పోటీ చేస్తున్న ఈమెకు డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.

Advertisement

చతికిల పడిన కాంగ్రెస్..
కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం లేకపోవడంతో మరోసారి ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని దీంతో వైఎస్ షర్మిల కూడా తట్ట బుట్టా సర్దుకొని పార్టీకి అలాగే ఏపీ రాజకీయాలకు కూడా దూరం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆరా మస్తాన్?

Published

on

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగాయి. అయితే ఎప్పుడు రాని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు మరొక రెండు రోజులలో రాబోతున్న నేపథ్యంలో అధికారం ఎవరిదనే విషయం గురించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

ఈ క్రమంలోనే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుందని చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ప్రజానాడి ఈ పోల్ సర్వేలు కూడా సరైన స్థాయిలో పట్టు సాధించలేదని తెలుస్తోంది.

ఇకపోతే ఆరా మస్తాన్ సర్వే పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తను తెలియజేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఈయన వెల్లడించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఉదయ్ కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు.

Advertisement

పవన్ గెలుపు ఖాయం..
అలాగే జనసేన పార్టీ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా ఆరా మస్తాన్ తన సర్వేలో వెల్లడించారు పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేశారని ఈయన తెలిపారు. ఈ సర్వేతో పాటు కేకే సర్వీస్ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దే విజయం అని వెల్లడించడంతో జనసేన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: లండన్ నుంచి తిరిగి వచ్చిన వైయస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ?

Published

on

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.

Advertisement

మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.

వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!