Connect with us

Movie News

జాతిరత్నాలు మెచ్చిన చిరు..డైరెక్టర్ ని పిలిపించి?

Published

on

జాతిరత్నాలు సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది.. ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే.. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా కి విజయ్ దేవరకొండ అతిధిగా రాగా, పలువురు ప్రముఖులు ఈ సినిమా కి అండగా నిలిచారు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీల‌క పాత్ర‌లో పోషించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది.

ప్రభాస్ కూడా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. దాంతో ఈ సినిమా పై ఒక్కసారిగా హైప్ వచ్చింది. మొదటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఎంతో వెరైటీ గా చేశారు యూనిట్.. ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అనుదీప్.. మ‌రోవైపు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీకి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది అంటున్నారు.

జాతిర‌త్నాలు ప్ర‌మోష‌న్స్‌లో.. మెగాస్టార్‌ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమ‌ని దర్శకుడు అనుదీప్ చెప్పాడు. అంతేకాదు ఆయననే స్ఫూర్తిగా తీసుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చానని అన్నాడు. అయితే ఇంతవరకు మెగాస్టార్‌ని కలిసే అవకాశం తనకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ముఖ నిర్మాత అశ్వనీదత్.. వెంట‌నే మెగాస్టార్‌తో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా అశ్వనీదత్‌ దగ్గరుండి మరీ అనుదీప్‌ని మెగాస్టార్‌ దగ్గరకు తీసుకుపోనున్నారట.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement

Featured

Amitabh Bachchan: నన్ను ట్రోల్ చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు బిగ్ బీ క్షమాపణలు!

Published

on

Amitabh Bachchan: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చిత్ర బృందం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా నాగీ ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది చెప్పటానికి కొన్ని ఫొటోస్ చూపించారు.

ఇక ఇందులో నేను ప్రభాస్ ను కొట్టే పాత్రలో నటించారు. అయితే దీనిని ప్రభాస్ అభిమానులు ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకుని నన్ను ట్రోల్ చేయొద్దు. ప్రభాస్ ను కొట్టినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన క్షమాపణలు చెప్పారు.

Advertisement

ప్రభాస్ ను కొట్టాను..
ఈ విధంగా అమితాబ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. అయ్యో సార్ నా అభిమానులంతా కూడా మీకు అభిమానులే అంటూ ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Tollywood: పవన్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్!

Published

on

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పవన్ కళ్యాణ్ .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విజయం పై ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈయన తన నిర్మాణ సంస్థలో ఏకంగా వంద సినిమాలను నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

టీజీ విశ్వప్రసాద్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తద్వారా పవన్ కళ్యాణ్ తో చాలా మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఈయన సెలెబ్రేట్ చేశారు జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: జాకెట్ విప్పడంతో ట్రోల్స్ ఎదుర్కొంటున్న అనసూయ.. వింత రోగం అంటూ కౌంటర్!

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఈమె ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. తద్వారా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బుల్లితెరకు ఇన్ని రోజులు దూరం ఉన్నప్పటికీ త్వరలోనే మరో సరికొత్త గేమ్ షో ద్వారా బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడుతూ జాకెట్ విప్పేసి రచ్చ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ విషయంపై కామెంట్ చేస్తూ..ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందని పోస్ట్ పెట్టాడు. అనసూయ స్పందించింది. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇంత రోగంతో భాదపడుతున్నారని అనిపిస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చింది.

Advertisement

కొన్ని మార్పులు తప్పవు..
మీరంటే నాకు చాలా ఇష్టం మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదనీ మరొక నెటిజన్ కామెంట్ చేయగా అనసూయ స్పందిస్తూ.. మేము సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళం మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. మీరంతా బుల్లితెరపై మాత్రమే తప్పులను కనిపెడతారు కానీ సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు వస్తే హిట్ చేస్తారు అంటూ తనదైన శైలిలోనే ఈమె సమాధానం ఇచ్చారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!