Connect with us

Featured

Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..

Published

on

కాలం, ఖర్మం కలిసొస్తే మళ్లీ వస్తానంటూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలను వీడారు. ఇటీవలే టైం సెట్ అయిందనుకున్నారో ఏమో కానీ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అంతా బాగుంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. సునామీ మాదిరిగా ఈ కూటమి విజయపరంపరను కొనసాగించింది. ఇంతటి సునామీలో సైతం గెలవలేకపోయిన వారిని దురదృష్టవంతులనే చెప్పాలి. అలాంటి దురదృష్టవంతుల్లో ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి. పదేళ్ల పాటు జనాలకు దూరంగా ఉండటం వల్లనో ఏమో కానీ ఆయనను జనాలు కూడా దూరం పెట్టేశారు. ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లి అవకాశం ఉండేదేమో.

సామాజికవర్గపరంగానూ కలిసొచ్చిన ప్రాంతమే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏపీ వైపు చూసింది కూడా పెద్దగా లేదు. చూసినా కూడా తన పనులు తాను చేసుకోవడం సైడ్ అయిపోవడం. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నప్పుడు తొలుత కాంగ్రెస్‌లోనే చేరారు. కానీ యాక్టివ్‌గా పని చేయలేదు. ఆ తరువాత బీజేపీ లో చేరారు. లోక్‌సభకు పోటీ చేశారు. నిజానికి రాజంపేట ఆయన అడ్డానే. అక్కడి నుంచి వైసీపీ తరుఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేశారు. సామాజికవర్గం పరంగానూ.. టీడీపీ, జనసేనకు మంచి పట్టున్న ప్రాంతం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ కలిసి రావాలి. అయినా సరే కూటమి హోరు కానీ.. తన సామాజిక వర్గం కానీ ఆయనను నిలబెట్టలేక పోయాయి. ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

Advertisement

ఓటేసినా ఉండరన్న భావన?

ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో 20 స్థానాలను గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. వీటిలో టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. కూటమి కోల్పోయిన నాలుగు స్థానాల్లో రాజంపేట ఒకటి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కటమికి అత్యధిక శాసనసభా స్థానాలను గెలుచుకుంది. కానీ లోక్‌సభ స్థానం మాత్రం పోయింది. నల్లారికి ఓట్లు బదిలీ కాలేదు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పీలేరు నుంచి టీడీపీ తరుఫున శాసనసభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తన ఓటమికి కారణం లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా ఏపీలో లేకపోవడం.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆయనకు ఓటేసినా కూడా ఏపీలో ఉండరన్న భావన జనాల్లో ఉండి ఉండొచ్చు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. మొత్తమ్మీద కిరణ్ కుమార్ రెడ్డి అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే గుడ్ బై చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Amitabh Bachchan: నన్ను ట్రోల్ చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు బిగ్ బీ క్షమాపణలు!

Published

on

Amitabh Bachchan: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చిత్ర బృందం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా నాగీ ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది చెప్పటానికి కొన్ని ఫొటోస్ చూపించారు.

ఇక ఇందులో నేను ప్రభాస్ ను కొట్టే పాత్రలో నటించారు. అయితే దీనిని ప్రభాస్ అభిమానులు ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకుని నన్ను ట్రోల్ చేయొద్దు. ప్రభాస్ ను కొట్టినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన క్షమాపణలు చెప్పారు.

Advertisement

ప్రభాస్ ను కొట్టాను..
ఈ విధంగా అమితాబ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. అయ్యో సార్ నా అభిమానులంతా కూడా మీకు అభిమానులే అంటూ ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Tollywood: పవన్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్!

Published

on

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పవన్ కళ్యాణ్ .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విజయం పై ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈయన తన నిర్మాణ సంస్థలో ఏకంగా వంద సినిమాలను నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

టీజీ విశ్వప్రసాద్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తద్వారా పవన్ కళ్యాణ్ తో చాలా మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఈయన సెలెబ్రేట్ చేశారు జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ యాడ్స్ చేయకపోవడానికి అదే కారణమా.. గ్రేట్ అంటూ?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇలా బిజీ అవుతున్న తరుణంలో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు మంచి గుర్తింపు పొందిన తర్వాత వారు కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా యాడ్స్ చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇకపోతే సినీ నటుడు పవన్ కళ్యాణ్ సైతం గతంలో కోలా అనే ఒక యాడ్ చేశారు. ఈయన కేవలం డబ్బు కోసమే చేశారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో తనకు పొలం కొనడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఈ యాడ్ చేశానని అయితే నా తొలి చివరి యాడ్ అదేనని తెలిపారు.. ఈ యాడ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి ఇకపై చేయనని చెప్పేసాను. ఇక నాకు అప్పట్లో సల్మాన్ ఖాన్ కంటే కూడా అధికంగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్న తాను చేయలేదని తెలిపారు.

Advertisement

ప్రజలకు మేలు జరగాలి..
ఈ విధంగా కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ తాను ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదని పవన్ తెలిపారు.పపన్ కళ్యాణ్ అనేవాడు గొంతు విప్పితే అది ప్రజలకి మేలు జరగాలి. ప్రజల కష్టాలకు భుజం కాయాలి. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి నేను ఈ మాటలు అనటం లేదు. ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది. సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇదంటూ పవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!