Featured
మధ్యప్రదేశ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం.. ఆందోళనలో అధికారులు?
Published
3 years agoon
By
lakshanaప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తే రెండవ దశ కన్నా రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతాయని అందుకే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్ లో నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 తో మృతిచెందిన వ్యక్తి జన్యు నమూనాలను పరీక్షించగా అసలు విషయం బయట పడినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకోగా ఉజ్జయినికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్న నలుగురు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్నారు. చనిపోయిన మహిళ ఒక డోస్ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని, ఇది రెండవ దశ కంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.
You may like
Covid Vaccination: ఇకపై కరోనా వ్యాక్సిన్ కు వారందరూ కూడా అర్హులే.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం!
Omicron Virus: ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?
Telangana Government: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..ఇక అన్ని పాఠశాలల్లో అది తప్పని సరి..!
Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో దాచిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!
Sad News: ఐదేళ్ల బాలికపై అత్యాచారం..! గొంతు కోసి.. మరీ ఘోరంగా..!
శివ శంకర్ మాస్టర్ కు ఆర్థిక సహాయం చేసిన మెగాస్టార్..!
Featured
Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?
Published
7 hours agoon
8 July 2024By
lakshanaLahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Featured
VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?
Published
9 hours agoon
8 July 2024By
lakshanaVN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.
ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్ హాల్లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్.. ఆడిషన్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Featured
Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!
Published
16 hours agoon
8 July 2024By
lakshanaSuma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.
ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?
VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?
Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!
Deepika Padukone: చీరలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన దీపికా… చీర ధర, ప్రత్యేకత ఏమిటో తెలుసా?
SJ Surya: నా మిత్రుడు పవన్ ఏదో ఒక రోజు ఏపీ సీఎం అవుతాడు.. పవన్ పై ఎస్ జె సూర్య కామెంట్స్!
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?
Sri Reddy: అది నిరూపిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా తిరుగుతా: శ్రీ రెడ్డి
Trending
- Featured4 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured2 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?
- Featured4 weeks ago
Sri Reddy: అది నిరూపిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా తిరుగుతా: శ్రీ రెడ్డి
- Featured4 weeks ago
Ramoji Rao: రామోజీరావు ఆస్తుల విలువ ఎంత ఆయన ఆస్తులకు వారసులు ఎవరో తెలుసా?
- Featured4 weeks ago
Mahasena Rajesh: నన్ను సస్పెండ్ చేయాలంటే ముందు ఆ పని చేయాలి: మహాసేన రాజేష్
- Featured4 weeks ago
Vishwambara: విశ్వంభరలో మరో మెగా హీరో.. హిట్టుకోసమే ఈ హడావిడి!