Connect with us

Featured

Actress Siva Parvathi : మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా

Published

on

Actress Siva Parvathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఇక షూటింగ్ లొకేషన్లో ఎవరైనా ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకపోతే వారిని చెడామడా తిట్టేస్తారు.ఈ క్రమంలోనే నటి శివపార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఒక సంఘటనను తెలియజేశారు.

Mohan Babu: మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్లో రౌడీ గారి పెళ్ళాం సినిమా చేస్తున్న సమయంలో తాను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తెలిపారు.ఈ సినిమా ద్వారానే తాను లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా నటించానని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ లో నటించాను. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శోభన నటించారని శివపార్వతి తెలిపారు. ఇక షూటింగ్ లొకేషన్ లో ఒక రోజు శోభన నాకు విష్ చేయకుండా వెళ్లిపోయారు.

Mohan Babu: మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!
Mohan Babu: మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

ఈ విషయం గమనించిన మోహన్ బాబు శోభనను నా దగ్గరకు పిలిచి ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఆమె ఎక్స్లెంట్ ఆర్టిస్ట్ తనకి ఎందుకు విష్ చేయలేదు అని తన ఎదురుగానే శోభనను తిట్టారని ఈ సందర్భంగా శివ పార్వతి వెల్లడించారు. ఇలా ఆయన ఎందుకు చెబుతున్నారు అని అనుకున్నాను.ఇది తప్పు అంటూ ఆ రోజు మోహన్ బాబు శోభనను తిట్టారు. ఇక మోహన్ బాబు దృష్టిలో ఒకసారి ఆర్టిస్ట్ అని ఆలోచన వచ్చిందంటే వాళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్ట్ అనే తేడాలు అతనికి ఉండవని తెలిపారు.

ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీకి అవసరం..

ఇకపోతే మోహన్ బాబు క్రమశిక్షణ లేకపోతే ప్రతి ఒక్కరిని గట్టిగా అరుస్తారని అయితే ఇలా అరిచే వాళ్లే ఇండస్ట్రీకి కావాలని ఈమె తెలిపారు.ఒకప్పుడు ప్రతి ఒక్కరూ సరైన సమయానికి షూటింగ్ లొకేషన్ కి చేరుకొని సినిమాలలో నటించే వారు. అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటలైనా అయినా ఒక షార్ట్ కూడా పూర్తి కావడంలేదని ప్రస్తుతం మన ఆర్టిస్టులలో సమయ పాలన లేదని, ఇలా క్రమశిక్షణలో పెట్టేవారు ఇండస్ట్రీకి అవసరం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!