Connect with us

Featured

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్

Published

on

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి
Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఆచార్య సినిమా కథ కాపీ అంటూ రచయిత రాజేష్ మండూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేష్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజేష్ సొంత గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథను సిద్ధం చేశానని వెల్లడించారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి
Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఇలా ఎంతో కష్టపడి ఈ సినిమాని క్రియేటివ్ గా కాకుండా నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించి మా నియోజకవర్గ ఎమ్మెల్యే సహాయంతో వారి సొంత బ్యానర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారికి సినిమా కథ వినిపించానని తెలిపారు. ఈ విధంగా మైత్రి మూవీ మేకర్స్ వారికి ఈ సినిమా కథను వినిపించగా నిజంగా కథ చాలా అద్భుతంగా ఉందని వారు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇలా బ్రీఫ్ గా కథ విన్న మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి కథ మొత్తం పిన్ టు పిన్ వివరించాను.

ఇలా కథ చెబుతున్న సమయంలో చెర్రీ అనే వ్యక్తి ఫోన్ రికార్డర్ ఆన్ చేసి పెట్టారు. అయితే తనకు సంబంధించిన వాళ్ళు అక్కడ లేకపోవడంతో తరువాత వారు ఈ కథను వింటారనే ఉద్దేశంతోనే రికార్డర్ ఆన్ చేశారని నేను భావించాను ఇలా కథను మొత్తం వింటూ రికార్డ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సినిమా కొరటాల శివలాంటి వారు చేస్తే చాలా బాగుంటుంది అని నాతో అన్నారు.

Advertisement

ఇలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిపై పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టడం కుదరదు అంటూ అప్పుడు మాట్లాడారు. ఇలా కథ మొత్తం విని ఏ విషయము తనకు తెలియ చేయకపోవడంతో తాను కూడా వారికి కథ నచ్చలేదేమో బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించారేమో అందుకే ఎలాంటి సమాచారం అందించలేదని మేము కూడా మా తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టాము.

దారుణంగా మోసం చేశారు..

ఇలా నా దగ్గర విని రికార్డ్ చేసుకున్న కథ చివరికి కొరటాల శివ దగ్గరకు వెళ్లిందని, నన్ను మోసం చేసి నా కథని కాపీ కొట్టారంటూ రాజేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడం వారు నా కథను మొత్తం కొరటాలకు పంపిస్తే అతను నా కథకు తన కథకు సంబంధం లేదని చెప్పారు. నా కథను అతనికి పంపించినప్పుడు తను కూడా తన ఆచార్య సినిమా కథను నాకు పంపించాలి. కానీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథను ఎలా ఇస్తాము అంటూ కొరటాల తన కథను ఇవ్వలేదంటూ రాజేష్ ఆవేదనచెందారు.ఇలా మోసం చేసి నా నుంచి ఆచార్య సినిమాని కాపీ కొట్టారంటూ ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!