Connect with us

Featured

షేర్లపై కొన్ని లక్షల కోట్ల సంపాదన.. కానీ సంతృప్తి చెందలేదు.. చివరకు 22 లక్షల ఎకరాలు కొనుగోలు చేశారు..

Published

on

మనం చదువుకునే రోజుల్లో నిజాం వద్ద కొన్ని లక్షల ఎకారాలు ఉండేవని చదువుకున్నాం. తర్వాత అవి చిన్న చిన్న భాగాలుగా విడిపోయి.. బడా భూస్వాముల వద్ద ఎక్కువగా.. పేదల దగ్గర ఒకటి నుంచి మూడు హెక్టార్ల వరకు భూమి ఉంది. ప్రస్తుతం 100 ఎకరాల భూమి ఉందంటే.. వామ్మో అంటూ అంటుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పే వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలిస్తే.. షాక్ అవుతాం. అతడి దగ్గర 22 లక్షల ఎకరాలు ఉన్నాయట. అసలు అతడు ఎవరు.. ఎంది కథ.. తెలుసుకుందాం..

రూపర్ట్ ముర్డోక్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ కు సంబంధించి పత్రికలల్లో ఇతడికి అధిక వాటా కలిగి ఉంది. ఇంతకంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా నిలిచాడు ‘జాన్ మెలోన్’. అతడు తన సొంతంగా అమెరికాలో ‘లిబర్టీ మీడియా’అనే టీవీ ఛానెల్ ను కూడా స్థాపించాడు. ఇతడు వారెన్ బఫెట్ కంటే కూడా ఎక్కవు పెట్టుబడులు పెట్టేవాడు.

ఇలా కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం.. షేర్లు కొనడం చేస్తూ ఉంటాడు. అతడికి అంతర్జాతీయ క్రీడ అయిన అట్టాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్లులో 8 శాతం షేర్లు కొన్నాడు. అతడు ఎక్కువ శాతం మీడియాకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అందులోనే ఎక్కువగా లాభాలను గడిస్తాడు. అయితే ఇంత సంపాదిస్తున్న అతడు భూమిపై ఎందుకు పెట్టుబడి పెట్టాడో తెలుసా.. అతడు వీటిపై ఆధిపత్యం చెలాయించి డబ్బులు సంపాదిస్తున్నా తృప్తి మాత్రం లేదు. ఓ రోజు అతడు పెన్సిల్వేనియాలో ఒక ఫామ్‌కి రెస్ట్ కోసం వెళ్లాడు.

Advertisement

అక్కడ ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట. మొదట న్యూ మెక్సికోలోని బెల్‌ రాంచ్‌ను 2.90లక్షల ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్‌ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్‌వుడ్ ఫామ్స్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాత అమెరికాలోని ప్రతీ ప్రదేశంలో భూములు కొనుక్కుంటూ వచ్చాడు. దీంతో అమెరికాలోని అతిపెద్ద భూ ప్వామిగా ఎదిగాడు. అతడి పేరు మీదు కొన్ని వందల హోటళ్లు కూడా ఉన్నాయి. ఇలా అతడు అమెరికాలో అందరికంటే ఎక్కువ భూమి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!