Connect with us

Featured

Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

Krishna – Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరు సూపర్ స్టార్, మరొకరు మెగాస్టార్. ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.

Published

on

Krishna – Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరు సూపర్ స్టార్, మరొకరు మెగాస్టార్. ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతూ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడుతుంటుంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఏకంగా 15 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీఅని పోటీపడ్డారు. ఇలా వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారిగా 1984వ సంవత్సరంలోనే మొదలైంది.కృష్ణ నటించిన బంగారు కాపురం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Krishna - Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?
Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

మరోసారి 1985లో వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన అగ్నిపర్వతం,మెగాస్టార్ చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ రెండు సినిమాలలో అగ్నిపర్వతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినగా చట్టంతో పోరాటం సినిమా మాత్రం ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడింది. 1985 ఏప్రిల్ నెలలో చిరంజీవి నటించిన చిరంజీవి సినిమాతో బాక్సాఫీసు వద్దకు వచ్చారు. అలాగే కృష్ణ అందరికంటే మొనగాడు చిత్రంతో అదే ఏడాది మరో సారి చిరంజీవికి పోటీగా వచ్చారు.

ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం జులై నెలలో కృష్ణ నటించిన వజ్రాయుధం చిరంజీవి నటించిన జ్వాల సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో వజ్రాయుధం అద్భుతమైన విజయాన్ని అందుకోగా చిరంజీవి జ్వాలా సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.1986 జనవరి ఒకటవ తేదీన చిరంజీవి కిరాతకుడు సినిమా విడుదల కాగా మూడవ తేదీ కృష్ణ నటించినకృష్ణ గారడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయాయి.

1986 ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంటబ్బాయి అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వారానికి కృష్ణ నటించిన కృష్ణ పరమాత్మ సినిమా విడుదలైంది. వారం వ్యవధిలో వచ్చిన ఈరెండు సినిమాలు ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. 1987 జనవరి నెలలో చిరంజీవి నటించిన దొంగమొగుడు సినిమా విడుదల కాగా ఈ సినిమాకు పోటీగా కృష్ణ నటించిన తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి దొంగ మొగుడు అద్భుతమైన విజయాన్ని అందుకోగా కృష్ణ సినిమా యావరేజ్ గా నడిచింది.

కృష్ణ దర్శకత్వంలో నటించిన శంఖారావం, మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం మధ్యాహ్నాలు ఏర్పడగా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. చిరంజీవి జేబుదొంగ కృష్ణ దొంగగారు స్వాగతం మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ చిత్రాలలో చిరంజీవి జేబుదొంగ ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా కృష్ణ దొంగగారు స్వాగతం యావరేజ్ గా నడిచింది. అలాగే చిరంజీవి ఖైదీ నెంబర్ 786, కృష్ణ రౌడీ నెంబర్ వన్ చిత్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో చిరంజీవి ఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చిరంజీవి 100వ చిత్రం త్రినేత్రుడు కృష్ణ నటించిన అగ్ని కెరటాలు మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో త్రినేత్రుడు వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. అదేవిధంగా చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకృష్ణ రాజకీయ చదరంగం మధ్య పోటీ ఏర్పడగా మెగాస్టార్ నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే విధంగా చిరంజీవి రాజా విక్రమార్క, కృష్ణ నాగాస్త్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో నాగాస్త్రం విజయం సాధించింది. అలాగే చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, కృష్ణ నటించిన పరమశివుడు విడుదలయ్యాడు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు సందడి చేయలేక పోయాయి.

Advertisement

ఒకేసారి హిట్ కొట్టిన మెగాస్టార్, కృష్ణ…

రెండు సంవత్సరాల తర్వాత కృష్ణ చిరంజీవి మధ్య మరి పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన పచ్చని సంసారం చిరంజీవి నటించిన ముఠామేస్త్రి మధ్య పోటీ ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరు 1994లో మరోసారి పోటీ పడ్డారు. మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్లు కృష్ణ నెంబర్ వన్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీలో కృష్ణ విజయం సాధించారు.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!