Connect with us

General News

జమిలి ఎన్నికలు.. చంద్రబాబు భలే కామెడీ చేస్తున్నారే..?

Published

on

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు 2022 సంవత్సరంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అమలాపురం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం అమలవుతోందని.. జగన్ రాష్ట్రాన్ని పాలించలేక చేతులెత్తేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

జగన్ వర్గం న్యాయ వ్యవస్థనే అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని.. కోర్టులపై సైతం విమర్శలు చేస్తోందని అన్నారు. జగన్ కేంద్రంతో కేసుల మాఫీ కోసమే సన్నిహితంగా మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయల సంపద అయిన అమరావతిని జగన్ సర్కార్ విధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్ తెచ్చిందని అయితే.. వాళ్లకు జగన్ రిజర్వేషన్ ఇవ్వట్లేదని అన్నారు.

జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీలలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను సైతం జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!